Aadi Srinivas : బీజేపీ నాయకులు ఈ దేశం కోసం చేసింది ఏమిటి..?
- దేశానికి త్యాగం చేసిన కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- నిజమైన బీజేపీ వాజపేయి, అద్వానీ కాలంలోనే ఉండిపోయింది
- 400 సీట్లు అంటున్న బీజేపీ, 240కి పరిమితం అయింది : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పని చేస్తున్నారు. అలాంటి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం,” అని ఆయన అన్నారు.
బీజేపీ దేశం కోసం చేసింది ఏమిటి? అని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్, “దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బీజేపీ నాయకుడిని బండి సంజయ్ చూపించగలడా?” అని సవాల్ విసిరారు. బీజేపీ గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు మనం చూస్తున్నది అసలు బీజేపీ కాదు. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల బీజేపీ ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. కానీ ఇప్పుడున్నది నకిలీ బీజేపీ, నకిలీ నాయకులతో నిండిపోయింది,” అని విమర్శించారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
“కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ రాష్ట్రంలో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి ప్రమాదాలు ఉంటే ఆయనే ముందుగా అధికారికంగా సమాచారం ఇవ్వాలి. మజ్లిస్ ను బూచి చూపించి బీజేపీ ఇంకెంత కాలం రాజకీయంగా బతుకుతుందో చూడాలి,” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్, “సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. 400 సీట్లు గెలుస్తామని హడావుడి చేసిన బీజేపీ చివరకు 240 సీట్లకే పరిమితమైంది,” అని పేర్కొన్నారు.
GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!