Aadi Srinivas : బీజేపీ నాయకులు ఈ దేశం కోసం చేసింది ఏమిటి..?
- దేశానికి త్యాగం చేసిన కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- నిజమైన బీజేపీ వాజపేయి, అద్వానీ కాలంలోనే ఉండిపోయింది
- 400 సీట్లు అంటున్న బీజేపీ, 240కి పరిమితం అయింది : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పని చేస్తున్నారు. అలాంటి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం,” అని ఆయన అన్నారు.
బీజేపీ దేశం కోసం చేసింది ఏమిటి? అని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్, “దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బీజేపీ నాయకుడిని బండి సంజయ్ చూపించగలడా?” అని సవాల్ విసిరారు. బీజేపీ గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు మనం చూస్తున్నది అసలు బీజేపీ కాదు. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల బీజేపీ ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. కానీ ఇప్పుడున్నది నకిలీ బీజేపీ, నకిలీ నాయకులతో నిండిపోయింది,” అని విమర్శించారు.
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
“కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ రాష్ట్రంలో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి ప్రమాదాలు ఉంటే ఆయనే ముందుగా అధికారికంగా సమాచారం ఇవ్వాలి. మజ్లిస్ ను బూచి చూపించి బీజేపీ ఇంకెంత కాలం రాజకీయంగా బతుకుతుందో చూడాలి,” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్, “సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. 400 సీట్లు గెలుస్తామని హడావుడి చేసిన బీజేపీ చివరకు 240 సీట్లకే పరిమితమైంది,” అని పేర్కొన్నారు.
GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!