Aadi Srinivas : బీజేపీ నాయకులు ఈ దేశం కోసం చేసింది ఏమిటి..?
- దేశానికి త్యాగం చేసిన కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- నిజమైన బీజేపీ వాజపేయి, అద్వానీ కాలంలోనే ఉండిపోయింది
- 400 సీట్లు అంటున్న బీజేపీ, 240కి పరిమితం అయింది : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పని చేస్తున్నారు. అలాంటి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం,” అని ఆయన అన్నారు.
బీజేపీ దేశం కోసం చేసింది ఏమిటి? అని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్, “దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బీజేపీ నాయకుడిని బండి సంజయ్ చూపించగలడా?” అని సవాల్ విసిరారు. బీజేపీ గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు మనం చూస్తున్నది అసలు బీజేపీ కాదు. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల బీజేపీ ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. కానీ ఇప్పుడున్నది నకిలీ బీజేపీ, నకిలీ నాయకులతో నిండిపోయింది,” అని విమర్శించారు.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
“కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ రాష్ట్రంలో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి ప్రమాదాలు ఉంటే ఆయనే ముందుగా అధికారికంగా సమాచారం ఇవ్వాలి. మజ్లిస్ ను బూచి చూపించి బీజేపీ ఇంకెంత కాలం రాజకీయంగా బతుకుతుందో చూడాలి,” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్, “సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. 400 సీట్లు గెలుస్తామని హడావుడి చేసిన బీజేపీ చివరకు 240 సీట్లకే పరిమితమైంది,” అని పేర్కొన్నారు.
GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..