TG Govt: ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు..

  • తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు
  • రాజస్థాన్ విద్యుత్ శాఖతో విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం
  • రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో ఎం ఓ యు.
Singareni

Singareni

తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడనుంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజస్థాన్ లో ఎంఓయు జరగనుంది.

Read Also: AP Assembly Budget Sessions: ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా.. గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదు: మంత్రి నిమ్మల

రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ క్రమంలో.. సింగరేణి ఆర్థిక పరిపుష్టికి అతి పెద్ద అవకాశం లభించనుంది. మొత్తం వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26 శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా ఇవ్వనుంది. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు లభించింది.

Read Also: IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి