మెటా యాజామాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మళ్లీ మరోక అదిరిపోయే ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్ లో వినియోగదారులు వాట్సాప్ ను ఒక్క ఫోన్ లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక కంపెనీ బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది.
Also Read : GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?
ఈ ఫీచర్ ద్వారా ఫోన్ డ్యామేజ్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన సమయాల్లో ఇంకొ పోన్ లో స్కానర్ ద్వారా లాగిన్ అయి వాట్సాప్ ఉపయోగించవచ్చు. గరిష్టంగా నాలుగు ఫోన్ లను ఒకే వాట్సాప్ నంబర్ తో లింక్ చేయవచ్చు. గతంలో ఈ ఫీచర్స్ కు సంబంధించి పలు వార్తలు వచ్చినప్పటికి, కంపెనీ మొట్టమొదటి సారిగా దాని బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. మొదటి పోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసి స్కానర్ సహాయంతో వేరే స్మార్ట్ ఫోన్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు అదనపు స్మార్ట్ ఫోన్ లను ఇలా లింక్ చేయేచ్చు.
Also Read : Rahul Gandhi : జైలు శిక్ష రద్దు చేయాలంటూ గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..
మెటా పేర్కొన్న వివరాల ప్రకారం.. వినియోగదారులు ఎప్పటి నుంచో ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా మొదటి ఫోన్ పనిచేయని టైంలో సెకండరీ ఫోన్ ద్వారా ఇతరుతో తమ మెసేజ్ లను తిరిగి పంపవచ్చు.. పొందవచ్చు.. ఫోటోలు, మీడియా ఫైల్స్ ను కూడా యాక్సిస్ చేయవచ్చు. సెకండరీ ఫోన్ లో వాట్సాప్ లాగిన్ కొద్ది రోజుల వరకు ఉంటుంది. ఈ తరువాత అది ఆటోమెటిక్ లాగ్ అవుట్ అవుతుంది. దీంతో వినియోగదారులు వేరే స్మార్ట్ ఫోన్ లలో లాగ్ అవుట్ అవడం మార్చిపోయినా కూడా ఈ ఫీచర్ తో అదే లాగ్ అవుట్ అయిపోతుంది.
Also Read : Bandi Sanjay : అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?
కొత్త ఫీచర్ ద్వారా ఎప్పటిలాగే, మెసేజ్ లు అన్ని కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది. రాబోయే మరి కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది. ఇతర స్మార్ట్ ఫోన్ లలో లాగిన్ కావడానికి క్యూఆర్ కోడ్ స్కానర్ తో పాటు.. ఓటీపీ ఆధారిత లాగిన్ సిస్టమ్ ను కూడా తీసుకురావలని కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది.