Actor Venu: హీరో వేణు పై కేసు నమోదు.. ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది.
Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్షిప్.. కట్ చేస్తే
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇక ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రొజెట్ సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు మొదలు పెట్టింది. ఇక వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను టీహెచ్డీసీ అందించింది. అందులో 5.5 % ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్ కన్స్రక్షన్స్ ఖాతాలో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కి, తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Kavya Maran: ఏంటి కావ్య పాప లవ్లో పడిందా.. ఆ యంగ్ క్రికెటర్ తోనేనా..?
ఇప్పుడు మిగిలిన పనులకు గాను రూ.1,010 కోట్ల రూపాయలు విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జమ చేసింది. ఇందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్రావు, మరో ప్రతినిధి, సినీ నటుడు తొట్టంపూడి వేణు, కావూరి భాస్కర్రావు తల్లి, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ పాతూరి.. రిత్విక్ ప్రాజెక్ట్స్తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. దింతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దింతో మొత్తం 5 మందిపై సెక్షన్ 406, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!