Actor Venu: హీరో వేణు పై కేసు నమోదు.. ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది.
Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్షిప్.. కట్ చేస్తే
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఇక ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రొజెట్ సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు మొదలు పెట్టింది. ఇక వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను టీహెచ్డీసీ అందించింది. అందులో 5.5 % ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్ కన్స్రక్షన్స్ ఖాతాలో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కి, తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Kavya Maran: ఏంటి కావ్య పాప లవ్లో పడిందా.. ఆ యంగ్ క్రికెటర్ తోనేనా..?
ఇప్పుడు మిగిలిన పనులకు గాను రూ.1,010 కోట్ల రూపాయలు విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జమ చేసింది. ఇందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్రావు, మరో ప్రతినిధి, సినీ నటుడు తొట్టంపూడి వేణు, కావూరి భాస్కర్రావు తల్లి, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ పాతూరి.. రిత్విక్ ప్రాజెక్ట్స్తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. దింతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దింతో మొత్తం 5 మందిపై సెక్షన్ 406, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!