Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News A New Type Of Fraud In Nellore With Duplicate Finger Prints

Duplicate Finger Prints: వేలిముద్రలు సేకరించారు.. రూ.51 లక్షలు దోచేశారు..!

Published Date :June 28, 2023 , 11:55 am
By Sudhakar Ravula
Duplicate Finger Prints: వేలిముద్రలు సేకరించారు.. రూ.51 లక్షలు దోచేశారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Duplicate Finger Prints: సైబర్‌ నేరగాలు చెలరేగి పోతున్నారు.. కొత్త కొత్త తరహాలో దోచేస్తున్నారు.. ఏదో రకంగా ఎరవేయడం.. దొరికినవారి నుంచి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. చివరకు వేలి ముద్రలను సేకరించి.. వాటి ద్వారా కూడా దోపిడీకి పాల్పడుతోన్న ముఠా.. పోలీసులకు చిక్కింది.. వేలిముద్రలు సేకరించి, వాటితో సొమ్ము దోచుకుంటున్న పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి.. ఈ ముఠా రూ.51.25 లక్షలు దోచేసినట్లు గుర్తించారు పోలీసులు..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్‌కి చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఇటీవల కొంత నగదు విత్‌డ్రా అయ్యింది.. అయితే, ఆమె ఫోన్‌కు ఎలాంటి ఎస్‌ఎంఎస్‌ రాలేదు.. కానీ, బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే అందులో ఉన్న నగదు మొత్తం మాయం అయ్యింది.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.. ఇక, నెల్లూరు గ్రామీణం, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంయుక్తంగా కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన ఎన్‌.వెంకటేశ్వర్లు, టి.మధుసూదన్‌రెడ్డి, డి.ఆనంద్‌రావు, ఎం.సాయికుమార్‌రెడ్డి, ఆర్‌.శ్రీనివాసులు, ఎస్‌కే ఉమర్‌, సీహెచ్‌ సన్నీ, ఎం.యువరాజ్‌, ఎన్‌.సుధాకర్‌, పి.రవీంద్ర కలిసి.. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజల వేలిముద్రలు సేకరించినట్లు దర్యాప్తు తేలింది.. ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ఆధారంగా వేలిముద్రలతో ఆయా ఖాతాల్లో నగదు దోపిడీకి తెర లేపారు కేటుగాళ్లు.. ప్రత్యేక యాప్స్‌ ద్వారా వేలిముద్రల ఆధారంగా ఖాతాల్లో ఉన్న నగదు గుట్టుగా లేపేశారు.. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. ఇక, ఈ ముఠాలో కర్నూలు జిల్లాకు చెందిన డాక్యుమెంటు రైటర్‌ కూడా ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది..

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

ఎలా దొంగతనం చేస్తారు..?
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులకు వచ్చి సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు తీసుకుని తమ ఆధార్ కాపీలు ఇవ్వడం ఆనవాయితీ. దీని ద్వారా, ఈ కేటుగాళ్లు వేలిముద్రలను మరియు సంబంధిత ఆధార్ కాపీలను స్కాన్ చేయడం.. స్కాన్ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్ కియోస్క్ టెక్నాలజీతో డబ్బును దోచేశారు..

బాధితులకు తెలియదా..?
బాధితుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలు. బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను సెల్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు చూసే అలవాటు కూడా లేనివారున్నారు.. అందుకే బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అయినా వారికి తెలియదు. దీంతో ఈ దొంగల పని సులువైంది. బాధితురాలి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగారు.. ఇక్కడ బాధితులు నెల్లూరు జిల్లాకు చెందినవారే అయినప్పటికీ 10 మంది నిందితులు జిల్లాకు చెందనివారు. ఇతర జిల్లాల్లో పనులు చక్కబెట్టారు. ఆన్‌లైన్‌లో కూడా కొంత డేటా సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇలాంటి మోసాలను నివారించేందుకు ఆధార్‌తో అనుసంధానించబడిన వేలిముద్రను నిలిపివేయాలని సూచించారు. అలా చేస్తే మన వేలిముద్రలు ఎవరికీ కనిపించవని, వేలిముద్రలతో మన ఆధార్ ను ఎవరూ వినియోగించుకోలేరని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Duplicate Finger Prints
  • fingerprints
  • fraud
  • Nellore

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions