UP: నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం, హత్య.. సవతి తల్లి ప్రమేయం
- యూపీలో దారుణం
- కత్రా శివదయాల్గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం.. హత్య
- బాలిక మృతదేహం పోస్టుమార్టం అనంతరం బయటపడ్డ నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ గోండా జిల్లాలోని కత్రా శివదయాల్గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం చంపేశాడు. ఈ హత్యలో బాలిక సవతి తల్లి ప్రమేయం కూడా ఉంది. కాగా.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో సాధు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు పోక్సో, అత్యాచారం చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడి రక్త నమూనాను పరీక్షల నిమిత్తం లక్నోకు పంపారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు విశ్వనాథ్ వాన్శ్వర్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Early Age of Menstruation : బాలికలలో చిన్న వయసులో పెద్దమనిషి కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
శనివారం ఉదయం కత్రా శివదయాల్గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకింద చిన్నారి మృతదేహం పడి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా.. ఆ బాలిక సాధువు వేషంలో ఉన్న వ్యక్తితో మద్యం మత్తులో చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ సమయంలో విష్ణు గుప్తా అనే వ్యక్తి చేసిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ కేసులో విష్ణును వాది చేసిన పోలీసులు.. గుర్తు తెలియని సాధువు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం, వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో.. నిందితుడిపై నమోదైన కేసులో అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్ను పెంచినట్లు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మనోజ్ రాయ్ తెలిపారు.
Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!
సాధువు వేషంలో ఉన్న మృగం వైరల్ వీడియో అతని అరెస్టుకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజు కాషాయ వస్త్రాలు ధరించిన విశ్వనాథ్ అరెస్ట్ సమయంలో జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి కనిపించాడు. టవల్తో ముఖాన్ని కూడా దాచుకునే ప్రయత్నం చేశాడు. మహేశ్పూర్ రైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. వైరల్ వీడియో ద్వారా మాత్రమే అతని ముఖం గుర్తించారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..