Ajay Maken: ఆప్తో పొత్తు ఒక పొరపాటు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
- ఆప్తో పొత్తు ఒక పొరపాటు
- కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ సంచలన వ్యా్ఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఒక పొరపాటు అని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘‘మౌకా మౌకా, హర్ బార్ ధోకా’’ అనే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాకెన్ మాట్లాడారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్యం సహా వివిధ అంశాల్లో ఆప్ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.

Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై పొరపాటు అని మాకెన్ అన్నారు. ‘‘కేజ్రీవాల్ను విశ్వసించవచ్చని నేను ఎప్పుడూ నమ్మలేదు. అతను తన ఆశయాలను నెరవేర్చడానికి ఏదైనా చేస్తాడు. అతనికి భావజాలం మరియు దృఢవిశ్వాసం లేదు” అని మాకెన్ ఆరోపించారు.
‘‘ప్రస్తుతం కొనసాగుతున్న 14 ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 10,250 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది ఢిల్లీలో ఆరోగ్యానికి రూ. 372 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్క ప్రకారం.. పనులు పూర్తి చేసి ఆసుపత్రులు పని చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అదనంగా ఈ ఆసుపత్రులను నిర్వహించడానికి సంవత్సరానికి రూ. 8,000 కోట్లు అవసరం. వారు దానిని ఎలా నిర్వహిస్తారు? ఈ ప్రభుత్వానికి క్లిష్టమైన మౌలిక సదుపాయాల కోసం డబ్బు లేదు. కానీ ప్రకటనల కోసం పుష్కలంగా ఉంది.”అని మాకెన్ అన్నారు. ఉపాధ్యాయులు, ఇతర అవసరమైన సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 56,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు.
గత దశాబ్ద కాలంగా కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీ, ఆప్ను టార్గెట్ చేసుకుని అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. ‘‘గత 11 సంవత్సరాలుగా ఆప్ ఢిల్లీని పరిపాలిస్తోంది. బీజేపీ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఢిల్లీ ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలను ఎంతో అంచనాలతో ఎన్నుకున్నారు. కానీ 11 సంవత్సరాల తర్వాత మోసం, నిరాశకు ప్రజలు గురయ్యారు. ఖాళీ వాగ్దానాలు తప్ప మరేమీ అందుకోలేదు.” అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో బుక్లెట్ను ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాస్తవ పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశారు.
తాజావార్తలు
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!