Ajay Maken: ఆప్తో పొత్తు ఒక పొరపాటు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
- ఆప్తో పొత్తు ఒక పొరపాటు
- కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ సంచలన వ్యా్ఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఒక పొరపాటు అని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘‘మౌకా మౌకా, హర్ బార్ ధోకా’’ అనే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాకెన్ మాట్లాడారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్యం సహా వివిధ అంశాల్లో ఆప్ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.

Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై పొరపాటు అని మాకెన్ అన్నారు. ‘‘కేజ్రీవాల్ను విశ్వసించవచ్చని నేను ఎప్పుడూ నమ్మలేదు. అతను తన ఆశయాలను నెరవేర్చడానికి ఏదైనా చేస్తాడు. అతనికి భావజాలం మరియు దృఢవిశ్వాసం లేదు” అని మాకెన్ ఆరోపించారు.
‘‘ప్రస్తుతం కొనసాగుతున్న 14 ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 10,250 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది ఢిల్లీలో ఆరోగ్యానికి రూ. 372 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్క ప్రకారం.. పనులు పూర్తి చేసి ఆసుపత్రులు పని చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అదనంగా ఈ ఆసుపత్రులను నిర్వహించడానికి సంవత్సరానికి రూ. 8,000 కోట్లు అవసరం. వారు దానిని ఎలా నిర్వహిస్తారు? ఈ ప్రభుత్వానికి క్లిష్టమైన మౌలిక సదుపాయాల కోసం డబ్బు లేదు. కానీ ప్రకటనల కోసం పుష్కలంగా ఉంది.”అని మాకెన్ అన్నారు. ఉపాధ్యాయులు, ఇతర అవసరమైన సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 56,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు.
గత దశాబ్ద కాలంగా కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీ, ఆప్ను టార్గెట్ చేసుకుని అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. ‘‘గత 11 సంవత్సరాలుగా ఆప్ ఢిల్లీని పరిపాలిస్తోంది. బీజేపీ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఢిల్లీ ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలను ఎంతో అంచనాలతో ఎన్నుకున్నారు. కానీ 11 సంవత్సరాల తర్వాత మోసం, నిరాశకు ప్రజలు గురయ్యారు. ఖాళీ వాగ్దానాలు తప్ప మరేమీ అందుకోలేదు.” అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో బుక్లెట్ను ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాస్తవ పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశారు.
తాజావార్తలు
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!