CJI: నీట్-యూజీపై విచారణ.. సీజేఐతో వాగ్వాదానికి దిగిన న్యాయవాది..అసలేమైందంటే..?
- నీట్-యూజీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ
- పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా వాదనలు
- అడ్డుకునేందుక యత్నించిన సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర
- కోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్ అని మండిపాటు
- సెక్యూరిటీని పిలిచిన డీవై చంద్రచూడ్
- లాయర్లను బయటకు పంపాలని ఆదేశం
- తమ ఇష్టానుసారం వాకౌట్ చేసిన ఇరు లాయర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్-యూజీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇంతలో సీనియర్ న్యాయవాది చేసిన పని సీజేఐ డీవై చంద్రచూడ్కు కోపం తెప్పించింది. ఆ న్యాయవాది, సీజేఐ మధ్య వాగ్వాదం జరిగింది. చీఫ్ జస్టిస్ వెంటనే సెక్యూరిటీని పిలిచారు. న్యాయవాదిని కోర్టు గది నుంచి బయటకు పంపాలని ఆదేశించారు. అయితే సీజేఐ తీవ్ర హెచ్చరిక చేయడంతో న్యాయవాదులు తమ ఇష్టానుసారం వాకౌట్ చేశారు.
READ MORE: Cigarette Prices: బడ్జెట్లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..
Also Read
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా నీట్ యూజీపై తన వాదనలు వినిపించారు. అప్పుడు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మళ్లీ మళ్లీ అడ్డుకోవడం ప్రారంభించారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. జస్టిస్ చంద్రచూడ్ మొదట అతనికి వివరించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా వాదనలను అడ్డుకోవద్దని సీజేఐ నెడుంపరను కోరారు. వారి అభిప్రాయాలను తెలియజేనివ్వండని తెలిపారు. కానీ నెడుంపర అంగీకరించలేదు. హుడా చర్చ మధ్యలో ఆయన జోక్యం చేసుకుంటూ.. ‘నేను ఓ విషయం చెప్పాలి’ అన్నారు.
READ MORE:Budget 2024: పేద ఖైదీలకు ఊరట..పెనాల్టీ, బెయిల్ కోసం ఆర్థిక సాయం..
నరేంద్ర హుడా వాదనను పూర్తి చేయనివ్వండి.. ఆ తర్వాత మీరు మీ పాయింట్లను చెప్పండి అని సీజేఐ అన్నారు. దీనిపై నెడుంపర మండిపడ్డారు. తాను కోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్ అన్నారు. ఆయన తీరుపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయవద్దని హెచ్చరించారు. నెడుంపర వాదిస్తూనే ఉన్నాడు. దీంతో ఆగ్రహించిన సీజేఐ వెంటనే సెక్యూరిటీని పిలిపించాలని ఆదేశించారు. వెంటనే వారిని న్యాయస్థానం నుంచి బయటకు తీసుకెళ్లండి అని ఆదేశించారు. దీనిపై నెడుంపర మాట్లాడుతూ.. ” మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళుతున్నాను.” అని వాకౌట్ చేశారు.
READ MORE:Vulture Population: భారత్లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నా.. సీజేఐ
గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నానని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయవాదులు కోర్టు వ్యవహారాలను నిర్దేశించడాన్ని తాను అనుమతించలేనన్నారు. దీనిపై నెడుంపర మళ్లీ మాట్లాడుతూ తాను 1979 నుంచి న్యాయవ్యవస్థను చూస్తున్నానని చెప్పారు. ఒక న్యాయవాది సీజేఐతో తీవ్ర వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. మార్చిలో ఎలక్టోరల్ బాండ్లపై విచారణ సందర్భంగా.. సీజేఐ అదే లాయర్తో “అరవకండి, మీ మాటలు వినడానికి మేము ఇక్కడ కూర్చోవడం లేదు” అని అన్నారు. అప్పుడు కూడా చర్చలో బలవంతపు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!