Family Dispute : అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త
Family Dispute : ఢిల్లీ సమీపంలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వండడం లేదని, ఇంటి పనులు సమయానికి చేయలేదని అనారోగ్యంతో ఉన్న భార్యను భర్తే హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భర్త పేరు భజరంగీ గుప్తా. భజరంగీ, ప్రీతి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరి మధ్య చీటికి మాటికి గొడవలు వచ్చేవి. ఆ సమయంలో ప్రీతిని భజరంగి ఎప్పుడూ కొట్టేవాడు. ప్రీతికి మూడు నెలల క్రితం పాప పుట్టింది. ప్రసవం కారణంగా ప్రీతి బలహీనంగా ఉంది. దీంతో ఆమె ఇంట్లో పనులు చేయలేకపోతుంది. దీనిని ఆమె భర్త తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇంటిపనులు చేయడం ఇష్టం లేదని ఆమె బద్ధకం నటిస్తుందని భర్త ఆరోపిస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ప్రీతి భర్తకు భోజనం సిద్ధం కాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భజరంగీ తన భార్య ప్రీతితో గొడవకు దిగాడు.
Read Also: Al-Qaida : ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ పై దాడి చేస్తాం : ఆల్ ఖైదా
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
ఆ తర్వాత కోపోద్రిక్తుడైన భజరంగి తన భార్యను చెక్క కర్రతో కొట్టడం ప్రారంభించాడు. దాడిలో ప్రీతి తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయింది. ఆ తర్వాత భజరంగీ ఇంటి నుంచి పారిపోయాడు. బంధువులు ప్రీతిని బురారీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రీతి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు భజరంగీని వెతికి పట్టుకున్నారు.
Read Also:Sri Hanuman Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు మాయం..
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!