Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News A Gang Was Arrested For Cheating By Giving Them Double Bedroom Flats

CP Sudheer Babu: డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌

Published Date :August 23, 2024 , 4:49 pm
By Gogikar Sai Krishna
CP Sudheer Babu: డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌ చేశారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. 6 గురితో కూడిన ముఠాను అరెస్ట్ చేసామని వెల్లడించారు. మొత్తం 3 రకాల నేరాలు చేశారని ఆయన తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేశారని, హర్షిణి రెడ్డి అనే మహిళ ఫేక్ లెటర్ లు, స్టాంపు లతో సహా క్రెయేట్ చేసిందని, A1 సురేందర్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టారన్నారు సీపీ సుధీర్‌ బాబు. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరిని మోసం చేశారని, గురుకుల పాఠశాలల కార్యదర్శిని కలిసి.. వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి బురిడీ కొట్టించారన్నారు సీపీ సుధీర్‌ బాబు. ప్రభుత్వ పెద్దల పేరుతో బదిలీల విషయంలోనూ గురుకుల అధికారులను మోసం చేశారని ఆయన తెలిపారు. ఉద్యోగం కోసం వెళ్లి ప్రిన్సిపాల్ ను బుట్టలోకి దింపారని, వసూళ్లు చేసిన డబ్బులను బెట్టింగ్ లలో పెడుతోంది ముఠా అని ఆయన తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరితో డబ్బులు వసూలు చేశారని, మొత్తం ఈ ముఠా చేతిలో 108 మంది బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. సురేందర్ పై గతంలో బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయని, ఏకంగా.. ముఠా లోని సభ్యులు వేం నరేందర్ రెడ్డి లా మాట్లాడి మరీ మోసాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.

Cylinder Blast: స్కూల్‌లో పేలిన సిలిండర్‌.. విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

అంతేకాకుండా..’మరీనా రోజ్ అనే మహిళ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు… అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్ ను అరెస్ట్ చేశాం… ఒక్క చర్లపల్లి పరిధిలోనే 98 మందిని మోసం చేశారు.. స్టాంపులు, సర్టిఫికెట్ లు తయారు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.. అమాయక ప్రజలే టార్గెట్ గా ముఠా మోసాలకు పాల్పడిందని ఆయన తెలిపారు. నిందితుల దగ్గర నుంచి లక్ష 97 వేలు, 8 మొబైల్స్ సీజ్ చేసాం.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిని అంటూ మోసాలు చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ చేశాం. ఆరుగురు ముఠా సభ్యులను మల్కాజ్గిరి కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేందర్ రెడ్డి ప్రధాన నిందితుడు అని, గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి కి ఫోన్ చేసిన నిందితుడు సురేందర్ రెడ్డి.. వేం నరేందర్ రెడ్డి గా పరిచయం చేసుకుని ట్రాన్స్ఫర్లు చేయాలనీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు… నిందితుడి మోసాన్ని పసిగట్టింది ఐఏఎస్ అధికారిని.. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, డబల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని పైసా వసూల్ చేయడం.. దాదాపు రూ. 1.29 కోట్ల డబ్బు వసూల్‌ చేశారు కేటుగాళ్లు. బాధితుల దగ్గర వసూల్‌ చేసిన డబ్బును ముఠా క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. 98 మంది దగ్గర డబల్ బెడ్ రూమ్ పేరుతో డబ్బులు వసూల్‌ చేశారు. 7 గురుకి ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు పేరుతో మోసం చేశారు. ఇద్దరికీ ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని గ్యాంగ్ మోసం చేసినట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. మొత్తం 107 మంది దగ్గర వివిధ పేర్లతో ఈ గ్యాంగ్‌ డబ్బులు వసూలు చేసినట్లు, నిందితులు సురేందర్ రెడ్డి, మెరీనా రోస్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిని రెడ్డి లు అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్‌ బాబు తెలిపారు.

Nepal: బస్సు ప్రమాదంలో 14 మంది భారతీయుల మృతి.. నేపాల్లో తరచూ ప్రమాదాలకు కారణాలివే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • CP Sudheer babu
  • fraud gang arrested
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions