Sanath Nagar: టీ తాగేవారు అలర్ట్.. నకిలీ టీ పొడి ముఠా గుట్టురట్టు..
- నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా అరెస్టు
- కొబ్బరి పీచు.. చెక్కపొడితో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా
- సనత్ నగర్ లోని కంపెనీపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్
- టన్నుల కొద్ది నకిలీ టీ పొడిని స్వాధీన పరుచుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు పక్కన టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త. పని ఒత్తిడితో కాస్త రిలాక్స్ కావడం కోసం టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని.. వేడి వేడిగా గుంజుతుంటారు. అయితే.. ఈ భయంకరమైన కథనం వింటే.. మీరు రోడ్డు పక్కన టీ తాగడమే మానేస్తారు. అధికారులు చేసిన సోదాలు ఈ భయంకరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
Read Also: History Of Tata Indica : ఇండికా కారుతో రతన్టాటాకి ఎమోషనల్ బాండింగ్!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
కల్తీ టీ పొడి తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తున్న ముగ్గురు కల్తీ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ లోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి కోణార్క్ టీ పౌడర్స్ సేల్స్ సప్లై పేరిట వ్యాపారం చేస్తున్నాడు. నాసిరకం టీ పొడిని కిలో రూ. 80 నుంచి 100కు కొనుగోలు చేస్తున్నాడు. ఆ పొడిలో కొబ్బరి పీచు, పంచదార పాకం, రసాయనాలు కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. దానిని కిలో రూ. 200 నుంచి 250 వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు అధికారులు.
Read Also: Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్..
ఒరిస్సాకు చెందిన ప్రతాప్ ప్రధాన్, ఫరీదాలు ఇతని వద్దే పని చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరు ఇతర షాపులకు టీ పొడి రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. నిందితులను విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కల్తీ టీపొడి వాడకంతో కామెర్లు, టైఫాయిడ్, ఎలర్జీలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించుకోవాలని టాస్క్ ఫోర్స్ అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?