Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : కోటి విద్యలు కూటి కోసం మాత్రమే అనే సామెత వినే ఉంటారు. ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా జానెడు పొట్టకు తిండి లేకపోతే ఎంత కష్టపడినా వృథా. నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలే. ప్రతీ వ్యక్తి తన స్వార్థం కోసం మాత్రమే ఇతరులపై ఆధారపడతాడు. అది బయట వారు మాత్రమే కాదు… కడుపున పుట్టినవారు, తోబుట్టువులు కూడా అంతే. ఇది హర్యానాలో జరిగిన సంఘటనతో స్పష్టమైంది.
హర్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలో డెబ్భై ఏళ్ల వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమ మరణానికి కారణం ఏమిటో ఓ లేఖలో తెలిపారు. తమ పిల్లలే వారి చావుకి కారణమని లేఖలో పేర్కొన్నారు. 2021 బ్యాచ్ కి చెందిన హరియాణా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు తమను చూసుకోవడం లేదని.. కనీసం వేళకు తిండి కూడా పెట్టడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ చంద్ర, ఆయన సతీమణి బాగ్లీ బాద్రాలోని గోపీ గ్రామంలో జీవించేవారు. తన కొడుకులకు పట్టణంలో 30 కోట్ల ఆస్తి ఉన్నా తమకు అన్నం పెట్టడంలేదని లేఖలో రాశారు. తమపై దౌర్జన్యం చేసిన కొడుకు, కోడళ్ళకు శిక్ష పడినప్పుడే చనిపోయిన మా ఆత్మలకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
Read Also: Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్
తన ఆస్తులన్నీ స్థానిక ఆర్య సమాజ్ కు విరాళంగా ఇవ్వాలని కోరారు.సొంత కొడుకుల చేతిలో అవమానం భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నాం అని రాసుకొచ్చారు. నీలం, వికాస్, సునీత, వీరేందర్ తమ చావుకు కారణమని వెల్లడించారు. ‘ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. నా లేఖ చదివే వారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే.. వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు నలుగురి మీద కేసులు నమోదు చేశారు. మృతుల మనవళ్లలో ఒకరు ఐఏఎస్ అధికారి కాగా మరొకరు ఆర్మీలో సైనిక అధికారిగా ఉన్నారు.
"मेरे बेटों के पास 30 करोड़ की संपत्ति है, जबकि हमारे पास रोटी नहीं.."
सुसाइड नोट लिख IAS के दादा-दादी ने की खुदकुशी, हरियाणा के चरखी दादरी से सामने आया मामला#Haryana pic.twitter.com/C4dVMCarcr
— News24 (@news24tvchannel) March 31, 2023
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..