Kidnap Drama: లక్ష రూపాయలను ఎగ్గొట్టడానికి యువకుడు కిడ్నాప్ డ్రామా.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap Drama: అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగ్గొట్టేందుకు యువకుడు ఆడిన కిడ్నాప్ డ్రామాకు బాలాపూర్ పోలీసులు తెరదించారు. లక్ష రూపాయలను ఎగ్గొట్టేందుకు పెదనాన్నను మోసం చేయబోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడ సాయిబాబానగర్లో నివాసం ఉంటున్న రమేష్ (40) వృత్తి రీత్యా లేబర్. అదే కాలనీకి చెందిన వృత్తి రీత్యా లేబర్ అయిన అతన పెదనాన్న వద్ద అతను మూడేళ్ల క్రితం లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న ఆ డబ్బులు తిరిగివ్వాలని అతని పెదనాన్న రమేష్పై ఒత్తిడి చేయసాగాడు. దీంతో పెదనాన్న కుటుంబంపై రమేష్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా పెదనాన్నను, అతని కొడుకుని పోలీసు కేసులో ఇరికిస్తే లక్షరూపాయలు ఎగొట్టవచ్చని పథకాన్ని రచించాడు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం సమయంలో రమేష్ ఆటోలో దేవతల గుట్ట సమీపంలోని ఆర్సీఐ మెయిన్ రోడ్ వద్ద దిగాడు. అక్కడ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైర్లతో ముందుగా కాళ్ళను గట్టిగా కట్టేసుకున్నాడు. అనంతరం చేతులు వెనకకు పెట్టుకుని ఒక చేతికి వైర్ను గట్టిగా, మరో చేతికి కాస్త లూజుగా కట్టుకున్నాడు. నోట్లో పెట్టీపెట్టనట్టు గుడ్డను పెట్టుకుని కింద పడి పెనుగులాడడం, గట్టిగా ములగడం ప్రారంభించాడు. అటుగా వచ్చిన అయోధ్యనగర్కు చెందిన కళ్యాణ్ బాలాపూర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతని కాళ్లకు, చేతులకు ఉన్న వైర్లను తొలగించారు. తనను పెదనాన్న కుమారుడు సురేష్ పని ఇప్పిస్తానని ఇక్కడికి తీసుకువచ్చి వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడని, హత్య చేయబోయాడని రమేష్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Constable Fell Down on Road: ఫుల్గా మందు కొట్టి రోడ్డుపై పడిపోయిన కానిస్టేబుల్.. ఆస్పత్రిలో రచ్చ..
ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన బాలాపూర్ పోలీసులకు రమేష్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటోలో రమేష్ ఒక్కడే దిగినట్లు పోలీసులు గుర్తించారు. పెదనాన్న కుమారుడు సురేష్ కాల్డేటా ఆధారంగా లొకేషన్ చెక్ చేయగా గుంటూరులో ఉన్నట్లు నిర్దారించారు. మరోసారి అతడిని విచారించగా గుంటూరులోనే ఉన్నట్లు సురేష్ చెప్పడంతో పోలీసులు తనదైన స్టైల్లో రమేష్ను విచారించారు. పెదనాన్నకు లక్షరూపాయలు ఎగ్గొట్టడానికే ఈ ఫేక్ కిడ్నాప్ హత్య డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గతంలో రమేష్ ఓ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన రమేష్ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!