Meghalaya: చర్చిలోకి ప్రవేశించి “జై శ్రీరామ్” నినాదాలు చేసిన యువకుడు.. చివరికీ..
- చర్చిలోపల 'జై శ్రీరామ్' నినాదాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్పై ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పోలీసులు
చర్చిలోపల ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సాగర్ వీడియోలు తనకు కనిపించాయని ఫిర్యాదుదారు తెలిపారు. వీడియోలో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. మతపరమైన పవిత్రతను దెబ్బ తీయడం కనిపించిందన్నారు. ఈ మేరకు రంగద్ గురువారం లైతుంఖర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్పై వరుణ్ ధావన్ వివరణ
Also Read
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
- Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. “ఆకాశ్ సాగర్ చర్చిలోకి ప్రవేశించి క్రైస్తవ వ్యతిరేక నినాదాలు చేశాడు. అంతే కాకుండా చర్చిలో క్రైస్తవేతర పాటలను పాడాడు. ఉద్దేశ పూర్వకంగానే ఇది జరిగింది. వీడియో ప్రకారం మరి కొంత మంది కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. మత విద్వేషాన్ని సృష్టించడం, మైనారిటీ సంస్కృతిని అవమానించడం, మత స్వేచ్ఛకు సంబంధించిన అన్ని రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Anna University Case: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి.. సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు..
ఈ అంశంపై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ మాట్లాడుతూ.. “ఈ వీడియో ద్వారా మతాల మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉంది. మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది నేరపూరిత చర్య. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేశాను. ఈ వీడియోలను డిలీట్ చేయాలి. వీటిని క్రియోట్ చేసిన, షేర్ చేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా ఖాతాలను నిషేధించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి నేరపూరిత ఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!