Meghalaya: చర్చిలోకి ప్రవేశించి “జై శ్రీరామ్” నినాదాలు చేసిన యువకుడు.. చివరికీ..
- చర్చిలోపల 'జై శ్రీరామ్' నినాదాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్పై ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చర్చిలోపల ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సాగర్ వీడియోలు తనకు కనిపించాయని ఫిర్యాదుదారు తెలిపారు. వీడియోలో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. మతపరమైన పవిత్రతను దెబ్బ తీయడం కనిపించిందన్నారు. ఈ మేరకు రంగద్ గురువారం లైతుంఖర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్పై వరుణ్ ధావన్ వివరణ
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. “ఆకాశ్ సాగర్ చర్చిలోకి ప్రవేశించి క్రైస్తవ వ్యతిరేక నినాదాలు చేశాడు. అంతే కాకుండా చర్చిలో క్రైస్తవేతర పాటలను పాడాడు. ఉద్దేశ పూర్వకంగానే ఇది జరిగింది. వీడియో ప్రకారం మరి కొంత మంది కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. మత విద్వేషాన్ని సృష్టించడం, మైనారిటీ సంస్కృతిని అవమానించడం, మత స్వేచ్ఛకు సంబంధించిన అన్ని రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Anna University Case: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి.. సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు..
ఈ అంశంపై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ మాట్లాడుతూ.. “ఈ వీడియో ద్వారా మతాల మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉంది. మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది నేరపూరిత చర్య. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేశాను. ఈ వీడియోలను డిలీట్ చేయాలి. వీటిని క్రియోట్ చేసిన, షేర్ చేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా ఖాతాలను నిషేధించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి నేరపూరిత ఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?