Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు ఈ రోజు బ్రేక్.. ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ వెళ్లారు. దీంతో శుక్రవారం ఒక రోజు భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ సెప్టెంబర్ 24 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుకానుంది. శనివారం నుంచి జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ కూడా పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధ్యక్ష పదవి గురించి చర్చించేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముఖ్యంగా రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయింది. ఆయనే తప్పకుండా అధ్యక్షుడు అవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ తో పాటు శశి థరూర్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, మనీస్ తివారీ వంటి వారు పోటీలో ఉంటారనేే ప్రచారం జరుగుతోంది.
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
Read Also: Azharuddin: అజారుద్దీన్తో సహా హెచ్సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు
మరోవైపు రాజస్థాన్ సీఎం అభ్యర్థిపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చర్చించే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే అని రాహుల్ గాంధీ గురువారం స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే ఆయన రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తదుపరి సీఎం ఎవరనేదానిపై చర్చించనున్నారు. ఇప్పటికే సచిన్ పైలెట్ సీఎం కావడానికి పావులు కదుపుతున్నారు. అయితే అశోక గెహ్లాట్ మాత్రం తనకు నమ్మకస్తుడిగా ఉన్న స్పీకర్ జోషిని ముఖ్యమంత్రి చేయాలని సిఫారసు చేశారు.
గురువారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ విత్ డ్రాకు అక్టోబర్ 8 చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!