Fine For Post Office: యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు రూ. 15 వేలు జరిమానా
- చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో.
- యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు..
- పోస్టాఫీసుకు రూ. 15 వేలు జరిమానా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fine For Post Office: చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా మనషా కౌంటర్లో రూ. 30 చెల్లించాడని.. అతనికి 50 పైసలు కస్టమర్ కి రావాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, పోస్టాఫీసుకు చెందిన సిస్టమ్ ఆటోమేటిక్గా ఫీజును రూ.30కి పూర్తి చేసిందని తెలిపింది. ఈ విషయంలో మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, సాంకేతిక సమస్యల కారణంగా యాభై పైసలు ఇవ్వడానికి పోస్టాఫీసు నిరాకరించింది.
Also Read
- Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
- RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనషా.. ఇండియా పోస్ట్ రోజువారీ లావాదేవీల వల్ల గణనీయమైన మొత్తంలో డబ్బు స్వాహా చేయబడుతుందని.. దాని ఫలితంగా నల్లధనం, GST రాబడి కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాలను స్థిరంగా “విస్మరించారని” పోస్ట్ ఆఫీస్ పేర్కొంది. అటువంటి మొత్తాన్ని సమీప రూపాయికి పూర్తి చేయడానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయబడిందని పేర్కొంది.
Read Also: DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..
యూపీఐ చెల్లింపుల కోసం వారి “Pay U” QR కోడ్ సిస్టమ్ నవంబర్ 2023 నుండి తప్పుగా పని చేసిందని, మే 2024లో నిలిపివేయబడిందని పోస్ట్ ఆఫీస్ వివరించింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, సాఫ్ట్వేర్ లోపం కారణంగా అధిక ఛార్జీ విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం.. రూ. 15,000 జరిమానా విధించాలని కోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
-
Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
-
Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
-
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!