Fine For Post Office: యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు రూ. 15 వేలు జరిమానా
- చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో.
- యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు..
- పోస్టాఫీసుకు రూ. 15 వేలు జరిమానా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fine For Post Office: చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా మనషా కౌంటర్లో రూ. 30 చెల్లించాడని.. అతనికి 50 పైసలు కస్టమర్ కి రావాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, పోస్టాఫీసుకు చెందిన సిస్టమ్ ఆటోమేటిక్గా ఫీజును రూ.30కి పూర్తి చేసిందని తెలిపింది. ఈ విషయంలో మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, సాంకేతిక సమస్యల కారణంగా యాభై పైసలు ఇవ్వడానికి పోస్టాఫీసు నిరాకరించింది.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Astrology: జూలై 4 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనషా.. ఇండియా పోస్ట్ రోజువారీ లావాదేవీల వల్ల గణనీయమైన మొత్తంలో డబ్బు స్వాహా చేయబడుతుందని.. దాని ఫలితంగా నల్లధనం, GST రాబడి కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాలను స్థిరంగా “విస్మరించారని” పోస్ట్ ఆఫీస్ పేర్కొంది. అటువంటి మొత్తాన్ని సమీప రూపాయికి పూర్తి చేయడానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయబడిందని పేర్కొంది.
Read Also: DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..
యూపీఐ చెల్లింపుల కోసం వారి “Pay U” QR కోడ్ సిస్టమ్ నవంబర్ 2023 నుండి తప్పుగా పని చేసిందని, మే 2024లో నిలిపివేయబడిందని పోస్ట్ ఆఫీస్ వివరించింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, సాఫ్ట్వేర్ లోపం కారణంగా అధిక ఛార్జీ విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం.. రూ. 15,000 జరిమానా విధించాలని కోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
-
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
-
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!