Sambhal Shiva Temple: ముస్లిం ఏరియాలో బయటపడ్డ 46 ఏళ్ల నాటి శివాలయం.. ఎలా గుర్తించారంటే? (వీడియో)
- ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 46 ఏళ్ల నాటి దేవాలయం
- చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన పోలీసుల
- ఈ ఆలయాన్ని పోలీసులు ఎలా గుర్తించారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 46 ఏళ్ల నాటి దేవాలయం బయట పడింది. ఈ శివాలయాన్ని బయటపడకుండా దాచినట్లు తెలుస్తోంది. ఈ పరమేశ్వరుని ఆలయాన్ని పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి.. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. అక్రమ కరెంట్ కనెక్షన్లను గమనించారు. ఈ విద్యుత్తు చోరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెకింగ్కు వెళితే కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు బెదిరిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఎస్పీకి తెలిపారు. అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నట్లు వాపోయారు. దీంతో నేడు పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమ విద్యుత్తు కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ విస్తుపోయే కట్టడాన్ని కనుగొన్నారు.
READ MORE: YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మసీదులు, ఇళ్లలో దొంగ కనెక్షన్లను గుర్తించేందుకు జరిపిన సోదాల్లో ఎత్తున విద్యుత్ చౌర్యం జరిగినట్లు వెల్లడైంది. అయితే.. దీపా రాయ్ ప్రాంతంలో తనిఖీ చేయగా.. అకస్మాత్తుగా ఓ ఇంట్లో ఆలయం బయటపడింది. ఈ గుడిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఆలయం 1978 సంవత్సరానికి చెందిందని చెబుతున్నారు. ఇందులో హనుమంతుడు, శివలింగం, నంది విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో డీఎం ఎస్పీతో పాటు భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. 46 ఏళ్లుగా మూతపడిన ఈ ఆలయం ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటికి 200 మీటర్ల దూరంలో కనిపించింది.
READ MORE:Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
ఈ విషయమై అడిషనల్ ఎస్పీ శ్రీశ్చంద్ర మాట్లాడుతూ.. “కొంతమంది ఇళ్లు కట్టుకుని ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీల్లో తేలింది. ఆలయాన్ని శుభ్రం చేశాం. ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆలయంలో శివుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు హిందూ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేవారు. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ముస్లిం జనాభా మధ్యలో మూసి ఉన్న ఆలయానికి సమీపంలో పురాతన బావి ఉన్నట్లు కూడా సమాచారం అందింది. బావి తవ్వుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలను కూడా కూల్చివేస్తాం.
A Shiva temple in Sambhal, closed for 46 years has been reopened by Yogi Adityanath's administration 🔥 शिव मंदिर
हिंदुओं अपने सही वोट की ताक़त देखों और योगी जी के सही निर्णय की तारीफ कर दिया करो
अपने धर्म के लिए योगी जी के साथ खड़े रहना
एक है तो सेफ़ है। हर हर महादेव pic.twitter.com/av0MacBdG7— pardeep jakhar (@jakharpardeep) December 14, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!