Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ దొరకడం లేదు అన్నమాట నిజమైనట్లు కనిపిస్తుంది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ కూడా మహిళకు రక్షణ లభించడం లేదు. లేడీస్ పై లైంగిక వేధింపులు ప్రస్తుతం సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చిన అవి కామాంధులకు భయాన్ని మాత్రం కల్పించడంలో విఫలం అవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు.
Read Also: Sunday Stotram: స్తోత్ర పారాయణం చేస్తే యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Adhika Sravana: అధిక శ్రావణ ఈ స్తోత్రాలు వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందుతారు
అయితే, ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలిని వారు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు కనుగొన్నారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి కరణ్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!