Ex-envoy Ajay Bisaria: ఆ అర్ధరాత్రి చిగురుటాకులా వణికిన పాక్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-envoy Ajay Bisaria: భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్ను విడిచిపెట్టింది పాకిస్థాన్. ఆ రోజు పాకిస్థాన్ ఎందుకలా భయపడిందనే విషయాలను ఆ సమయంలో పాక్లో భారత హైకమిషనర్గా పని చేసిన అజయ్ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా ‘యాంగర్ మేనేజ్మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్ షిప్ బిట్ఇండియా అండ్ పాకిస్థాన్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అజయ్ బిసారియా బాలాకోట్ దాడుల తర్వాత భారత దౌత్య పరిస్థితులకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.
Read Also: Lalit Modi: ఆర్సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్థాన్ బంధించిన అనంతరం భారత్ తీవ్రం స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్కు అప్పటి పాక్ హైకమిషనర్ సోహైల్ మహమ్మద్ ఇస్లామాబాద్లో ఉన్నారని అజయ్ బిసారియా తన పుస్తకంలో తెలిపారు. “ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘ ప్రధాని మోడీతో ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను(అజయ్ బిసారియా) వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడేందుకు ప్రధాని మోడీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు.” అని అజయ్ బిసారియా ఆ పుస్తకంలో వెల్లడించారు.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను విడిపించుకునేందుకు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దానివల్లే అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భయపడిందని అజయ్ తన పుస్తకం వెల్లడించారు. 2019లో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అభినందన్ను పాక్ విడిచిపెట్టి మంచి పని చేసిందని, లేదంటే వారు భయంకరమైన రాత్రి చవిచూడాల్సి వచ్చేది” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!