Site icon NTV Telugu

Student Suicide : ఇంటర్‌లో ఫెయిల్‌.. మనస్థాపంతో 9 మంది విద్యార్థులు బలవన్మరణం

Tamilnadu Dead Man Wakes Up

Tamilnadu Dead Man Wakes Up

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు రావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈతవాకిలికి చెందిన అనూష(17) ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో నిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్ణాటకలోని తన అమ్మమ్మ గ్రామానికి వెళ్లిన ఆమె అక్కడ ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read : Russia-Ukraine War: పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్ నగరం.. తెల్లవారుజామునే రష్యా భీకర దాడులు

అదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గణితంలో ఫెయిల్ కావడంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన అనకాపల్లికి చెందిన కారుబోతు తులసి కిరణ్ (17) నిన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) పరీక్ష రాకపోవడంతో టెక్కలి వద్ద నిన్న తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read : Forecast : ఏపీ వాసులకు అలర్ట్‌.. నేడు, రేపు ఏపీకి వర్ష సూచన

విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ (16), బోనెల జగదీష్ (18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాల్ గ్రామానికి చెందిన మహేష్ (17), ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ జాన్ సైదా (16), అదే జిల్లా చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ కమిటయ్యారు. ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లను పొట్టన పెట్టుకున్నాడు.

Exit mobile version