జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారత ఆర్మీపై టెర్రరిస్టుల దాడులు చేస్తుంది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రతి చోట గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడిన కొంతమంది ఉగ్రవాదులను కోర్టులో హాజరుపర్చాగా వారికి శిక్ష ఖరారు చేసింది. అలాగే, బారాముల్లాలోని ఎనిమిది మంది ఉగ్రవాదులను కోర్టు పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్వర్క్ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
Read Also: Chandrababu: నేటి నుంచి ప్రజాపాలన మొదలైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా..
అయితే, పోలీసుల అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులు ఉరీ సెక్టార్లోని ఎల్ఓసీ పక్కనే ఉన్న గ్రామాల్లో నివాసిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వీరంతా గత 28 ఏళ్లుగా పాకిస్థాన్ కు చెందిన కొంతమంది టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లో బానిసలుగా ఉన్నారు.. భద్రతా బలగాల నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పాకిస్థాన్ దేశం వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు ఆశ్రమం పొందిన తర్వాత మళ్లీ భారత్ కు వచ్చి ఇక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని కోర్టుకు పోలీసులు వెల్లడించారు.
Read Also: OMG (O Manchi Ghost) : ‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తుంది జాగ్రత్త!
ఇక, పరారీలో ఉన్న ఉగ్రవాదుల్లో ఉరీలోని కంది బర్జాలా నివాసితులు మహ్మద్ ఆజాద్, నసీర్ అహ్మద్, జబ్లా ఉరీకి చెందిన కరీం దీన్, బడా గోహలన్కు చెందిన మహ్మద్ హఫీజ్ మీర్, షౌకత్ అహ్మద్ పోస్వాల్, హద్కూట్, బషీర్ అహ్మద్ అవాన్ ఉన్నారు అని కోర్టులో పోలీసులు వెల్లడించారు. అయితే, వీరందరినీ పరారీలో ఉన్నవారిగా ప్రకటిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఉగ్రవాదులందరి ఇళ్లలో, గ్రామాల్లో అతికించామని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ప్రతి ఒక్కరూ లొంగిపోవడానికి నెల రోజులు గడువు ఇచ్చారు.. లేకుంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.