Chandrababu: నేటి నుంచి ప్రజాపాలన మొదలైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా..
- ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా.. తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రెస్మీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 2003లో క్లైమోర్ మైన్స్ పేలుడు సమయంలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడమే తన ధ్యేయమన్నారు. ఏపని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేదవారికి అందేలా చేయడం అంతే ముఖ్యమన్నారు. ఇవన్నీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్వన్గా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెడతాననని హామీ ఇచ్చారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని.. కొందరు దాడులు చేసి మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదన్నారు. మంచివారిని కాపాడుకోవాలి, చెడ్డవారిని శిక్షించాలన్నారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని.. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు.
Read Also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్లో శాఖల కేటాయింపు?.. పవన్కు కీలక శాఖలు !
Also Read
- Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్గా బాబర్ రీఎంట్రీ..
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నామని.. వేంకటేశ్వర స్వామి నిద్రలేచిన వెంటనే ప్రార్థనా చేస్తానని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రోజు కోరుకుంటానన్నారు. పరిపాలనా అంటే సెక్రటేరియట్ నుంచి ప్రజల మధ్య నుండి పరిపాలనా సాగేలా చూశానన్నారు. వేంకటేశ్వర స్వామిని ఒక్కటే కోరికను కోరానని.. దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని చెప్పిన చంద్రబాబు.. ఆ కుటుంబ వ్యవస్థ కలకాలం ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రపంచం వ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాలను నిర్మాణం చేపట్టాలని, చేపట్టే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సంపదను సృష్టించడంతో పాటు పేదవారికి అందేలా చూస్తామన్నారు. మా కుటుంబానికి తాను ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని.. వారికి కాస్త సమయం కేటాయిస్తే చాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టే సంస్కృతి మానడం లేదని.. ఇక నుంచి ఆ పద్ధతి మారుస్తామన్నారు. నేను అందరినీ వాడిని, ఐదుకోట్లమంది ప్రజాప్రతినిధినని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతిలను నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని నిర్మించి ప్రజలకు అందజేస్తామన్నారు.
తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమని, అలాంటి తిరుమలను అపవిత్రత చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలో గోవింద నామం, ఓం నమో వెంకటేశాయ శ్లోకం తప్ప ఏది వినపడకూడదన్నారు. తిరుమలలో మద్యం,గంజాయి, అన్య మత ప్రచారం సహా అన్ని అసాఘింక కార్యక్రమాలకు అడ్డా మార్చారని మండిపడ్డారు. తిరుమల పవిత్రను నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. కోర్టు కేసులు, లాబియింగ్ కోసం తిరుమలను వాడుకుంటారా అని ప్రశ్నించిన ఆయన.. వేంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
-
Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్గా బాబర్ రీఎంట్రీ..
-
Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!