Delhi: చలిపెడుతుందని కొరివి పెట్టుకున్నారు.. తెల్లారే సరికి శవాలయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి నుంచి బయటపడేందుకు చాలామంది మంటలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ మంటలే కొన్ని చోట్ల ప్రజల మరణాలకు దారి తీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అలాంటి మంటలకు బలవుతున్న జనాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢిల్లీలో చలి నుంచి తప్పించుకునేందుకు పొయ్యి వెలిగించి నిద్రిస్తున్న.. రెండు వేర్వేరు కేసుల్లో ఆరుగురు చనిపోయారు. ఒక కేసు ఇంద్ర పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా, మరొకటి అలీపూర్కు చెందినది. ఈ వ్యక్తులు రాత్రి చలి నుండి తప్పించుకోవడానికి రాత్రి పూట కొరివి వెలిగించారు. పొయ్యి నుంచి పొగలు రావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు చెబుతున్నారు.
Read Also:Indore T20 Records: ఇండోర్లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్కు చుక్కలు తప్పవా?
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇంద్రపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో 56 ఏళ్ల వ్యక్తి, 22 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. అలీపూర్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాత్రి పూట కొరివి పెట్టుకుని పడుకున్నాడని చెబుతున్నారు. ఉదయం వారి మృతదేహాలను చూసిన ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also:Sreeleela: పాపం డాన్స్ కి మాత్రమే వాడుతున్నారు… పాప టైమ్ అయిపోయినట్లేనా?
ఘటన గురించి సమాచారం ఇస్తూ, శనివారం ఉదయం 6.40 గంటలకు తమకు పిసిఆర్ కాల్ వచ్చిందని, నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఢిల్లీలోని ద్వారకలో కూడా ఇదే తరహాలో ఓ జంట మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారి రెండు నెలల పాప తృటిలో ప్రాణాలతో బయటపడింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!