Delhi: చలిపెడుతుందని కొరివి పెట్టుకున్నారు.. తెల్లారే సరికి శవాలయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి నుంచి బయటపడేందుకు చాలామంది మంటలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ మంటలే కొన్ని చోట్ల ప్రజల మరణాలకు దారి తీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అలాంటి మంటలకు బలవుతున్న జనాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢిల్లీలో చలి నుంచి తప్పించుకునేందుకు పొయ్యి వెలిగించి నిద్రిస్తున్న.. రెండు వేర్వేరు కేసుల్లో ఆరుగురు చనిపోయారు. ఒక కేసు ఇంద్ర పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా, మరొకటి అలీపూర్కు చెందినది. ఈ వ్యక్తులు రాత్రి చలి నుండి తప్పించుకోవడానికి రాత్రి పూట కొరివి వెలిగించారు. పొయ్యి నుంచి పొగలు రావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు చెబుతున్నారు.
Read Also:Indore T20 Records: ఇండోర్లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్కు చుక్కలు తప్పవా?
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
ఇంద్రపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో 56 ఏళ్ల వ్యక్తి, 22 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. అలీపూర్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాత్రి పూట కొరివి పెట్టుకుని పడుకున్నాడని చెబుతున్నారు. ఉదయం వారి మృతదేహాలను చూసిన ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also:Sreeleela: పాపం డాన్స్ కి మాత్రమే వాడుతున్నారు… పాప టైమ్ అయిపోయినట్లేనా?
ఘటన గురించి సమాచారం ఇస్తూ, శనివారం ఉదయం 6.40 గంటలకు తమకు పిసిఆర్ కాల్ వచ్చిందని, నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఢిల్లీలోని ద్వారకలో కూడా ఇదే తరహాలో ఓ జంట మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారి రెండు నెలల పాప తృటిలో ప్రాణాలతో బయటపడింది.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!