పాపువా న్యూ గినియాలోని ఉత్తర హైలాండ్స్లో గిరిజనుల మధ్య జరిగిన పోరులో దాదాపు 53 మంది మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఎంగా ప్రావిన్స్లో రెండు తెగల మధ్య జరిగిన ఆకస్మిక దాడిలో పురుషులు మరణించినట్లు ఆస్ట్రేలియన్ స్టేట్ బ్రాడ్కాస్టర్ తెలిపింది. కాగా, ఈ ఘటన ఆదివారం నాడు జరిగింది.
Read Also: MS Dhoni Captain: ఐపీఎల్ ఆల్-టైమ్ జట్టుకు కెప్టెన్గా ఎంఎస్ ధోనీ.. రోహిత్కు దక్కని చోటు!
అయితే, పాపువా న్యూ గినియాలోని అన్ని హైలాండ్స్లో జరిగిన దాడిలో ఇదే అతి దారుణమైన ఘటన అని దేశ పోలీసు దళంలో సీనియర్ అధికారి జార్జ్ కాకాస్ చెప్పారు. అయితే, పసిఫిక్ దేశం వందలాది తెగలకు నిలయంగా కొలువై ఉంది.. వీరిలో చాలా మంది ఇప్పటికీ మారుమూల భూభాగంలో నివసిస్తున్నారు. ఇక, గత సంవత్సరం ఎంగా ప్రావిన్స్లో 60 మందిని చంపిన ఘర్షణలకు కారణమైన అదే తెగలకు చెందిన తాజా హింసలో పాల్గొన్నారని సమాచారం.
Read Also: Nikki Haley: పుతిన్ ను మరింత శక్తివంతంగా చేసేందుకు ట్రంప్ ప్లాన్..
ఇక, పాపువా న్యూ గినియా నుంచి వచ్చిన వార్తలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇవాళ ఒక రేడియో ఇంటర్వ్యూలో అన్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పాపువా న్యూ గినియాలో భద్రత కోసం మేము గణనీయమైన సహాయాన్ని అందిస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు.