China : చైనాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 47 మంది మృతి
- చైనాలో భారీ వరదలు
- కొండచరియలు విరిగిపడి 47మంది మృతి
- బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది. ఇదే నగరంలో ఇంతకు ముందు మరో తొమ్మిది మంది మరణించారని పేర్కొంది. ఏప్రిల్లోనే చైనాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదల హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో కూడా చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరద లక్షల ఇళ్లను ముంచేసింది.
Read Also:Jagga Reddy : రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండి
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ కుండపోత వర్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణ చైనాలోని పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు పంటలు కూడా ధ్వంసమయ్యాయి. రెస్క్యూ టీమ్లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందిస్తున్నాయి.
కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర విపత్తుల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికి గ్వాంగ్డాంగ్లో గురువారం ముందుగా అత్యవసర ప్రతిస్పందన స్థాయిని పెంచారు. తద్వారా ఆ సహాయం ప్రజలకు త్వరగా చేరుతుంది. అనేక ఇతర ప్రావిన్సులలో లెవెల్-IV అత్యవసర ప్రతిస్పందన ఇప్పటికే సక్రియం చేయబడింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చైనాలో వరదల సీజన్ ముందుగానే ప్రారంభమైందని సమాచారం.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!