Nun Dead Body Intact: చనిపోయి నాలుగేళ్లయింది.. అయినా ఇదెలా సాధ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nun Dead Body Intact: ఎవరైయినా చనిపోతే ఏమీ చేస్తారు.. వారిని వారి ఆచారాల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. చనిపోయిన తరువాత ఖననం చేస్తే కొద్ది రోజుల్లో అస్థిపంజరాలు మిగులుతాయి. అలా కాకుండా ఖననం చేయకుండా చనిపోయిన వారి మృతదేశాన్ని అలాగే కొద్ది కాలం ఉంచాలనుకుంటే కొన్ని రసాయనాలను వినియోగిస్తారు. కానీ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఖననం చేస్తే.. అస్థిపంజరమే మిగులుతుంది. కానీ అమెరికాలోని మిస్సౌరీలో నాలుగేళ్ల క్రితం మరణించిన ఓ క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరణించిన సమయంలో ఎలా ఉందో.. నాలుగేళ్ల తరువాత కూడా అలానే ఉంది. ఇదెలా సాధ్యమయిందని.. మృతదేహాన్ని చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. అమెరికా గోవెర్ పట్టణంలో క్యాథలిక్ సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ 95 ఏళ్ల వయస్సులో 2019 మే 29న మరణించారు. దీంతో ఆమె మృతదేహాన్ని చెక్క శవపేటికలో ఉంచి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ఖననం చేశారు. నాలుగేళ్ల కిందట ఖననం చేసిన క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకపోగా.. కుళ్లిన సంకేతాలు కూడా కనిపించకపోవడం గమనార్హం. దీంతో దానిని చూసేందుకు క్రైస్తవ సన్యాసినులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అమెరికాలోని మిస్సౌరీలో ఈ అద్భుతం వెలుగుచూసింది. సిస్టర్ విల్హెల్మినా 1995లో బెనెడిక్టైన్స్ ఆఫ్ మేరీ, క్వీన్ ఆఫ్ అపోస్టల్స్ ఆర్డర్ను స్థాపించినట్టు ది కాన్సాస్ సిటీ డియోసిస్ సెయింట్ జోసెఫ్ వెల్లడించింది. కాగా, మత ఆచారం ప్రకారం ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు మృతదేహా అవశేషాలను తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే 18న ఖననం చేసిన ప్రదేశంలో శవపేటికను వెలికి తీశారు. లోపలి ఉన్న భౌతికకాయం కనీసం చెక్కుచెదరకపోవడంతో ఆశ్చర్యపోయారు.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ఆమె నెక్కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్టు ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరం పాక్షికంగా పాడైన చెక్క శవపేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అని బంధువుల అంటున్నారు.ఆమె మృతదేహాన్ని మరోచోటికి తరలించి సమాధి చేయనున్నట్టు వారు తెలిపారు. ఆమె తల్లి సిసిలియా మాట్లాడుతూ ఇది దేవుడి పట్ల ఆమెకు ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడు ఇచ్చిన వరం కాబోలని అన్నారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!