Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం. నక్సలైట్లు గాయపడిన లేదా మరణించిన వారిని వెంటనే అడవుల్లోకి లాగగలిగారని అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చింతగుఫా, కిస్టారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోటలో ఉన్న ఛోటేకెడ్వాల్ గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
Also Read: ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
డివిజన్ కమిటీ సభ్యుడు, మావోయిస్టుల కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ రాజు, కీలక మావోయిస్టులు ఛోటేకెడ్వాల్, బడేకెడ్వాల్, సింఘన్మడ్గు గ్రామాలలో 30-35 మంది కార్యకర్తలతో కలిసి ఉన్నారనే సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించబడిందని ఆ పోలీసు అధికారి వెల్లడించారు. నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ గంట పాటు జరిగిన కాల్పుల్లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా జరుగుతోందని అధికారి తెలిపారు.
నక్సలైట్లు తమ సహోద్యోగుల మరణాలకు గుర్తుగా జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు ‘అమరవీరుల వారోత్సవాలు’ పాటిస్తారు. అమరవీరుల వారోత్సవం నేపథ్యంలో అనేక నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, అంటే దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్లలో పోలీసులు భద్రతను పెంచుతారు. ఎందుకంటే ప్రజా ఆస్తులను దెబ్బతీసేందుకు నక్సల్స్ అనేక విధ్వంసక చర్యలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!