Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ
- కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం
- గతేడాది ఆవిష్కరించి ప్రధాని మోడీ
- మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఓ కోటలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఓ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం కుప్పకూలింది. దీన్ని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రస్తుతం విగ్రహం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనేది నిర్ధారణ కాలేదు. అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ప్రతిపక్షాలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శించాయి. పనుల నాణ్యతపై తక్కువ శ్రద్ధ చూపిందని ఆరోపించాయి.
READ MORE: Husband Kills Wife: డంబుల్స్తో భార్యను కొట్టి చంపిన భర్త.. కారణమిదే..?
Also Read
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
పీటీఐ ప్రకారం… 35 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మధ్యాహ్నం 1 గంటలకు మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో పడిపోయిందని ఓ అధికారి తెలిపారు. దీనికి గల కారణాన్ని నిపుణులు కనుగొంటున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది కూడా ఓ కారణం కావచ్చని అధికారుల అభిప్రాయం. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నష్టంపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
READ MORE: Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పనుల నాణ్యతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త టెండర్లను మాత్రమే జారీ చేస్తుంది.” అని ఆరోపించారు. శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే వైభవ్ నాయక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిలో నాణ్యత లేనిదని విమర్శించారు. “రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. విగ్రహం నిర్మాణం, ప్రతిష్టాపనకు బాధ్యులైన వారిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!