Nanded Hospital: నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఏడుగురు మృతి.. 48 గంటల వ్యవధిలో 31 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newborns and Patients Die at Maharashtra’s Nanded Hospital: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు, చిన్నారులు సహా 24 మంది రోగులు చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఏడుగురులో నలుగురు చిన్నారులు ఉన్నారు. గడచిన 48 గంటల వ్యవధిలో నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. అయితే ఆసుపత్రిలో ఎలాంటి తప్పు జరగలేదని పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ కిషోర్ రాథోడ్ అంటున్నారు.
నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి మరణాలపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఈ అంశంపై మరింత సమాచారం కోరామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ మరణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఈరోజు మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
Also Read: Hyderabad Man Kills in London: లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!
నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్ శంకర్రావు చవాన్ మాట్లాడుతూ… ‘ఇది తృతీయ స్థాయి ఆసుపత్రి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చికిత్స నిమిత్తం వస్తుంటారు. 70-80 కిమీల పరిసరాల్లో ఇలాంటి ఆసుపత్రి అందుబాటులో లేనందున అత్యవసర మరియు అత్యంత క్లిష్టమైన కేసులు వస్తుంటాయి. దూరం కారణంగా కొందరికి వైద్యం అందడంలో జాప్యం అయి చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోయి చనిపోతున్నారు. సిబ్బంది బదిలీల కారణంగా కొంత ఇబ్బంది ఉంది. మేము హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ నుంచి మందులు కొనుగోలు చేయవలసి ఉంది. కానీ అది కూడా జరగలేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..