Kakarla Suresh: ఉదయగిరి టీడీపీలోకి చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన కాకర్ల సురేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, నారా లోకేష్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నాడు ఆయన అనుచర వర్గంతో కలిగిరి మండలం అనంతపురం గ్రామం నుంచి సుమారు 3000 బైకులతో ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డిలు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు.
Read Also: CM Revanth Reddy: నేడు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాం.. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటే పరిశ్రమలు వస్తాయి.. ఉపాధి దొరుకుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు. అలాగే, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది.. బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. ఇక, ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను ప్రగతి పథంలో నడిపిస్తామని నియోజకవర్గంలో వెనుకబడిన సీతారామపురం మండలాన్ని అగ్రగామిగా నిలుపుతామని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?