Pakistan: పోలీస్ స్టేషన్పై తాలిబన్ల దాడి.. ముగ్గురు పాక్ పోలీసులు మృతి
Pakistan: పాకిస్తానీ తాలిబన్కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ గిరిజన జిల్లా సరిహద్దులోని సర్బంద్ పోలీస్ స్టేషన్పై ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లు, ఆటోమేటిక్ ఆయుధాలు, స్నైపర్ షాట్లతో దాడి చేశారు. క్రాస్ ఫైరింగ్లో ముగ్గురు పోలీసులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి కాషిఫ్ అబ్బాసీ తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
చనిపోయిన ముగ్గురు పోలీసులలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్దార్ హుస్సేన్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. స్టేషన్పై ఉగ్రవాదుల దాడిని పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టారని, ధైర్యంగా పోరాడారని ఖైబర్ పఖ్తున్ఖ్వా పోలీస్ చీఫ్ మోజమ్ జా అన్సారీ తెలిపారు. భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో డీఎస్పీ గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ ఘటనను ఖండిస్తూ, ఉగ్రవాదంపై పోరులో పోలీసుల త్యాగం వృథాగా పోదని అన్నారు. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
Read Also: DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్కు డీఎంకే నేత బెదిరింపు
గత రాత్రి పెషావర్లోని రెండు పోలీసు పోస్టులపై తమ ముజాహిదీన్ లేజర్ గన్లతో దాడి చేసినట్లు టీటీపీ ప్రతినిధి ముహమ్మద్ ఖురస్సాని ఒక ప్రకటనలో తెలిపారు. రెండు కళాష్నికోవ్లు, రెండు మ్యాగజైన్లు, రూ.47,000 స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దాడిలో డీఎస్పీ ర్యాంక్ పోలీసు అధికారితో సహా నలుగురు పోలీసులను చంపినట్లు, ముగ్గురు గాయపడ్డారని టీటీపీ పేర్కొంది.
తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)ని సాధారణంగా పాకిస్తానీ తాలిబాన్ అని పిలుస్తారు, ఆఫ్ఘన్-పాకిస్తానీ సరిహద్దులో పనిచేస్తున్న వివిధ సాయుధ తీవ్రవాద గ్రూపుల గొడుగు సంస్థగా ఇది రూపొందింది. 2007లో ఏర్పడిన ఈ బృందం ఆఫ్ఘన్ తాలిబాన్తో ఉమ్మడి భావజాలాన్ని పంచుకుంటుంది. 2001–2021 యుద్ధంలో వారికి సహాయం చేసింది.
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!