Pakistan: పోలీస్ స్టేషన్పై తాలిబన్ల దాడి.. ముగ్గురు పాక్ పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తానీ తాలిబన్కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ గిరిజన జిల్లా సరిహద్దులోని సర్బంద్ పోలీస్ స్టేషన్పై ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లు, ఆటోమేటిక్ ఆయుధాలు, స్నైపర్ షాట్లతో దాడి చేశారు. క్రాస్ ఫైరింగ్లో ముగ్గురు పోలీసులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి కాషిఫ్ అబ్బాసీ తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
చనిపోయిన ముగ్గురు పోలీసులలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్దార్ హుస్సేన్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. స్టేషన్పై ఉగ్రవాదుల దాడిని పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టారని, ధైర్యంగా పోరాడారని ఖైబర్ పఖ్తున్ఖ్వా పోలీస్ చీఫ్ మోజమ్ జా అన్సారీ తెలిపారు. భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో డీఎస్పీ గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ ఘటనను ఖండిస్తూ, ఉగ్రవాదంపై పోరులో పోలీసుల త్యాగం వృథాగా పోదని అన్నారు. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
Read Also: DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్కు డీఎంకే నేత బెదిరింపు
గత రాత్రి పెషావర్లోని రెండు పోలీసు పోస్టులపై తమ ముజాహిదీన్ లేజర్ గన్లతో దాడి చేసినట్లు టీటీపీ ప్రతినిధి ముహమ్మద్ ఖురస్సాని ఒక ప్రకటనలో తెలిపారు. రెండు కళాష్నికోవ్లు, రెండు మ్యాగజైన్లు, రూ.47,000 స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దాడిలో డీఎస్పీ ర్యాంక్ పోలీసు అధికారితో సహా నలుగురు పోలీసులను చంపినట్లు, ముగ్గురు గాయపడ్డారని టీటీపీ పేర్కొంది.
తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)ని సాధారణంగా పాకిస్తానీ తాలిబాన్ అని పిలుస్తారు, ఆఫ్ఘన్-పాకిస్తానీ సరిహద్దులో పనిచేస్తున్న వివిధ సాయుధ తీవ్రవాద గ్రూపుల గొడుగు సంస్థగా ఇది రూపొందింది. 2007లో ఏర్పడిన ఈ బృందం ఆఫ్ఘన్ తాలిబాన్తో ఉమ్మడి భావజాలాన్ని పంచుకుంటుంది. 2001–2021 యుద్ధంలో వారికి సహాయం చేసింది.
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..