Electricity Bill: పూరి గుడిసెకు రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు.. షాక్లో కుటుంబ సభ్యులు!
Auto driver gets power bill of Rs 3,31,951 lakh in AP: ఓ సాధారణ మధ్య తరగతి చెందిన ఇంట్లో 2-3 లైట్స్, ఓ ఫ్యాన్ ఉంటాయి. నెలకు విద్యుత్తు బిల్లు రూ. 150 నుంచి 200 వస్తుంది. ఎండాకాలంలో మహా అయితే ఇంకో రూ. 100 ఎక్కువ వస్తుంది. మొత్తంగా విద్యుత్తు బిల్లు రూ. 300 మించదు. అయితే ఓ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది.
ఎస్ రాయవరం మండలం గోకులపాడులోని దళిత కాలనీలో ఆటో డ్రైవర్ రాజుబాబు నివాసం ఉంటున్నాడు. అతడు ఉండేది పూరి గుడిసెలో. రెండు రోజుల క్రితం (జులై 8)న రాజుబాబు ఇంటికి ఏకంగా రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇంత బిల్లు రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. తమకు ఇంత బిల్లు ఎలా వచ్చిందో అని రాజుబాబు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read: Harry Brook Record: ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్!
రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు ఎలా వచ్చింది అని రాజుబాబు కుటుంబ సభ్యులు విద్యుత్తు సిబ్బందిని ప్రశ్నింశారు. సాంకేతిక సమస్య వల్ల బిల్లు అంతమొత్తం వచ్చినట్లు వారు గుర్తించారు. బిల్లును సరిచేసి.. రూ. 155 బిల్లుని రాజుబాబుకు అందజేశారు. సాంకేతిక సమస్య ఎలా వచ్చిందో అధికారులు వివరించారు. ఈ విషయంపై కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి మాట్లాడుతూ.. వినియోగదారుడు రాజుబాబుకు ఈ నెల రూ. 155 బిల్లు వచ్చిందని, ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఇలాంటి ఘటనే గతేడాది కూడా చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆటో డ్రైవర్కు రూ. 7,02,825 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని చాతకొండ హమాలీ కాలనీకి చెందిన సంపత్ మాడిశెట్టికి ఈ బిల్లు వచ్చింది. మూడు ట్యూబ్ లైట్లు, ఒక కూలర్, ఒక రిఫ్రిజిరేటర్ మరియు రెండు ఫ్యాన్స్ ఉన్న ఆ ఇంటికి సగటు కరెంటు బిల్లు రూ. 500. అధికారులు బిల్లును సరిచేసి అతనికి రూ. 675 బిల్లు ఇచ్చారు.
Also Read: Gold Rate Today: మగువలకు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత ఉందంటే?
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!