Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు స్నేహితులు. రామ నవమి నాడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీంతో ముగ్గురూ కలిసి కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. కాని ఇది వారి చివరి రామ నవమి అని వారికి తెలియదు.
ముగ్గురు పిల్లలు ఢిల్లీలోని భల్స్వా నివాసితులు. మొదట ఓ చిన్నారి నీట మునిగిన వార్త అందింది. దీని తర్వాత డైవర్ల బృందం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాలువలోకి దిగినప్పుడు, ఒకరు కాదు ముగ్గురు స్నేహితులు మునిగిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. డైవర్లు తొలుత కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు పిల్లల వయస్సు దాదాపు 13 నుంచి 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Read Also:Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
కాలువలో ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రోహిణి జిల్లాలోని కేఎన్ కట్జూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం చిన్నారులకు జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే పరిగణిస్తున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు అంకిత్, రెహాన్, అయాన్గా పోలీసులు గుర్తించారు. అసలే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్నానాలు చేసేందుకు కాలువలు లేదా నదుల్లోకి వెళ్తుంటారు. కాలువలోకి ప్రవేశించిన తరువాత, బలమైన ప్రవాహం, ఈత రాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also:Janasena: రాజోలులో పవన్కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్బై
వేసవిలో ఇటువంటి సంఘటనలు తరచుగా గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే కాలువలు, నదుల్లో ఏటా అనేక మంది మరణిస్తున్నారు. మునక్ వంటి కాలువల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, స్నానాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్నానాలు చేయకుండా ఉండాలన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!