Odisha Train Accident: 230 దాటిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. బాధితుల్లో బెంగాల్వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ప్రమాద ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. స్థానిక రైల్వే అధికారులు ఒకలా.. రైల్వే అధికార ప్రతినిధి మరొలా చెబుతున్నారు. తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పిందని.. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై వస్తోన్న గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన చేశారు. తొలుత కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందని.. దాని బోగీలు బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ రైలు పట్టాల మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్పై బోల్తాపడ్డాయని తెలిపారు. ప్రమాదం తర్వాత బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. తక్షణమే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్బంజ్, కటక్ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అలర్ట్ చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 120 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి 200 అంబులెన్స్లతోపాటు అవసరం ఉన్న మేరకు వైద్యులను ఒడిశా ప్రభుత్వం పంపించింది.
Read Also: Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారం
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి సంఘీభావంగా ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది. శనివారం జరిగే ఒడిశా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం రద్దుచేయడంతోపాటు.. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. : రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. “రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. దర్యాప్తు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం.. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం.. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం.” అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!