Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఓ వ్యక్తికి శునకాలంటే బహు ప్రీతి. ఈ ఇష్టంతోనే ఆయన 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం వీటిపై వీధి కుక్కలు దాడి చేసి అందులో ఒకదాన్ని చంపేయగా., మరొక దానిని గాయపరిచాయి. ఈ విషయాని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి ఎలాగైనా సరే వీధి కుక్కలని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ పెద్ద పథకమే వేసాడు. ఇందులో భాగంగానే తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తి తుపాకీ సహాయంతో ఏకంగా 20 వీధి కుక్కలను చంపేశాడు. ఈ అమానవీయ సంఘటన నెల రోజుల క్రితం జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Cheapest Diesel Car: చౌకైన డీజిల్ కారు.. 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్!
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు మేరకు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ వివరాలను తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి హైదరాబాద్ లోని రెడ్హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఈయనకి ఫలక్నుమాకు చెందిన తారీఖ్ అహ్మద్, మహ్మద్ తాహెర్ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే నర్సింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. వారి ఇంట్లో డాక్స్హుండ్ జాతి రకం పెంపుడు కుక్కలు ఉన్నాయి.
Also Read: Water Supply: నేడు నగరంలో నీటి సరఫరా బంద్..
ఈ కుక్కలని వీధికుక్కలు ఒకదాన్ని కరిచి చంపడంతోపాటు.. మరోదాన్ని గాయపరిచాయి. దాంతో వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తన కారులో మిత్రులతో కలిసి పొన్నకల్ గ్రామానికి చేరుకున్నాడూ. ఈ క్రమంలో అదే రోజు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తారిఖ్ అహ్మద్ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాల్చుకుంటూ వెళ్లారు. ఈ దెబ్బకి గ్రామంలోని 20 మూగజీవాలు మృతివాత పడ్డాయి. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బెంజ్కారులో వచ్చారని నిర్ధారనాకు వచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి 0.22 రైఫిల్, 6 సెల్ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!