Bihar Man: బంఫరాఫర్.. 20 రోజుల్లో ఇద్దరు ప్రియురాళ్లతో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ యువకుడు బంఫరాఫర్ కొట్టేశాడు. 19 ఏళ్ల వయసులో రెండు పెళ్లుళ్లు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ముగ్గులోకి దించి.. ఇద్దర్నీ 20 రోజుల వ్యవధిలో మనువాడాడు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.
బీహార్లోని జముయ్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు నెల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు సందర్భాల్లో మహిళలను కలవడానికి ఇంటికెళ్లి రెండుసార్లు పట్టుబడ్డాడు. ఆ తర్వాత గ్రామస్తులు అతనికి ఇద్దరిని ఇచ్చి వివాహం చేశారు. జముయిలోని మలయ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కేసు నమోదైంది. 19 సంవత్సరాల వయస్సులో ఒక యువకుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
వినోద్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు అక్షర గ్రామ నివాసి. యువకుడు లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్కాడిహ్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ మహిళకు అప్పటికే వివాహమై ఒక బిడ్డ ఉంది. కానీ ఆమె వినోద్తో ప్రేమలో పడింది. భర్త, బిడ్డను పట్టించుకోకుండా ప్రేమలో పడింది. వినోద్ కుమార్.. ప్రీతి కుమారిని కలవాలని ప్లాన్ చేసి ఏప్రిల్ 22న ఆమెను కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. యువకుడు.. ఆమె ఇంటికి రాగానే గ్రామస్తులు గమనించి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఇద్దరిని గుడికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ మహిళతో ఇంటికి వచ్చి కాపురం చేస్తున్నాడు.
అయితే ఈ ప్రేమకథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రీతి కుమారితో పెళ్లి కాకముందే వినోద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వినోద్ తన గ్రామంలో డీజేలో పని చేస్తున్నాడు. డీజేలో పని చేసే ఒక మహిళా సింగర్ గిరిజా కుమారితో పరిచయం ఏర్పడింది. ఒకరి కొకరు మాట్లాడుకోవడం.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ప్రేమలో పడ్డారు. ప్రీతి కుమారితో వివాహమైనప్పటికీ గిరిజాతోనూ సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మొదటి భార్యకు తెలియకుండా మెయింటెన్స్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు గిరిజా కుమారిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు.. ఇద్దర్ని ఆలయానికి తీసుకెళ్లి మ్యారేజ్ చేశారు. మొత్తానికి 20 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రీతి కుమారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య గిరిజా చెప్పడం విశేషం. కలిసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య వెల్లడించింది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!