Mobile Tower Stolen In Bihar: అసలుసిసలు దొంగతనమంటే ఇదీ.. పట్టపగలే సెల్ టవర్ చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Tower Stolen In Bihar: దొంగలంటే అందరూ పడుకున్నాక రాత్రిళ్లు ఇళ్లల్లో చొరబడి విలువైన సామగ్రి ఎత్తుకుపోతారని తెలుసు. లేకపోతే జేబు దొంగలు, చైన్ స్నాచర్ల గురించి విన్నాం కానీ.. ఏ దొంగతనంలోనూ ఎవరైనా పట్టుకుంటారేమోనన్న భయంతోనే దొంగలు ఇంతటి సాహసాలు చేస్తుంటారు. కానీ పట్టపగలే ఊరు మధ్యలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నే లేపేశారంటే వాళ్ల గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
బీహార్ రాజధాని పాట్నాలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఓ దొంగల ముఠా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ సెల్ టవర్ను ఎత్తుకెళ్లింది. కచ్చి తలాబ్ ప్రాంతంలో ఓ మొబైల్ సర్వీస్ కంపెనీ సెల్ టవర్ను ఏర్పాటు చేసింది. కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆ సెల్ టవర్కు కొన్ని నెలలుగా ఓ కంపెనీ అద్దె చెల్లించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన ఓ దొంగల ముఠా సెల్ టవర్ను దొంగిలించడానికి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే సెల్ టవర్ ఉన్న స్థలం యజమానితో ముందుగానే దొంగలు మాట్లాడారు. తాము టవర్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులమని, కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేకపోతున్నామని చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Read Also: Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?
సెల్ఫోన్ టవర్ను రెండు మూడు రోజుల్లో వచ్చి విప్పుకెళ్తామని స్థలం యజమానితో దొంగల ముఠా సభ్యులు చెప్పారు. దాంతో స్థలం యజమాని వారికి ఓకే చెప్పాడు. చెప్పినట్టే రెండు రోజుల తర్వాత దొంగల ముఠా సభ్యులు వచ్చి.. పట్టపగలే అందరూ చూస్తూండగానే 2-3 రోజులలో టవర్ను నేలమట్టం చేశారు. ఆపై విడి భాగాలను ఓ ట్రక్కులో వేసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుకున్న సెల్ టవర్ అధికారులు స్థలం యజమానిని అడగ్గా.. అతడు అంతా వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. టవర్ను కూల్చివేసేందుకు దాదాపు 25 మంది సెల్ఫోన్ టవర్ వద్దకు వచ్చారట. పెద్ద సుత్తెలు, గ్యాస్ కట్టర్ లాంటి ఆయుధాలతో సంఘటనా స్థలానికి వచ్చారట. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆదివారం కేసు నమోదు అయింది. 19 లక్షల రూపాయల విలువైన మొబైల్ టవర్ను దొంగలు దోచుకున్నారని కంపెనీ అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!