Tirumala: డిసెంబర్లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉంటారు.. కొన్ని సందర్భాల్లో తిరుమల గిరులు భక్తులతో రద్దీగా మారతాయి.. ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే వారిని కట్టడి చేయడం కూడా కష్టమే అనే తహారలో భక్తులు రద్దీ కనిపిస్తోంది. అయితే, రద్దీ కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 19.16 లక్షలు ఉందని టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.116.7 కోట్ల ఆదాయం వచ్చింది.. కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది.. 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.. 6.87 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది..
Read Also: Dilbag Singh: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు, మద్యం, విదేశీ ఆయుధాలు లభ్యం
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, తిరుమనలో ఈ నెల 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామన్నారు. మరోవైపు.. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి 15వ తేదీన తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!