Warangal: ప్రైవేట్ ఆస్పత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు..18మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆసుపత్రులపై పోలీసులు నిఘా పెట్టారు. నలింగ నిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వారి నుంచి 18 సెల్ ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నారు. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Also: Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
నర్సంపేట కేంద్రంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విస్తు పోయే విషయం ఏంటంటే.. ఆయుర్వేద వైద్యులు కూడా అబార్షన్లు చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వైద్యులు, సిబ్బంది అందరినీ అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరలో వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులనుంచి అబార్షన్ల కోసం రూ. 30వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నే పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నే పూర్ణిమ, వర్ని ప్రదీప్ రెడ్డి, కీతా రాజు, కాళ్ల అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. బాల్నే ఆశాలత, కొంగర రేణుక, భూక్య అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్. మరికొంత మంది పరారీలో ఉన్నారు.
Read Also: Karnataka: మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!