Warangal: ప్రైవేట్ ఆస్పత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు..18మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆసుపత్రులపై పోలీసులు నిఘా పెట్టారు. నలింగ నిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వారి నుంచి 18 సెల్ ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నారు. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Also: Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
నర్సంపేట కేంద్రంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విస్తు పోయే విషయం ఏంటంటే.. ఆయుర్వేద వైద్యులు కూడా అబార్షన్లు చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వైద్యులు, సిబ్బంది అందరినీ అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరలో వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులనుంచి అబార్షన్ల కోసం రూ. 30వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నే పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నే పూర్ణిమ, వర్ని ప్రదీప్ రెడ్డి, కీతా రాజు, కాళ్ల అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. బాల్నే ఆశాలత, కొంగర రేణుక, భూక్య అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్. మరికొంత మంది పరారీలో ఉన్నారు.
Read Also: Karnataka: మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!