Jammu Kahmir: కేంద్రం కీలక నిర్ణయం.. లోయలో కాశ్మీర్ పండిట్ టీచర్ల బదిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని గత కొంత కాలంగా కాశ్మీరి హిందువులు నిరసన, ఆందోళను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తడి పెరిగింది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీర పండిట్ ఉపాధ్యాయులను శ్రీనగర్ నగరానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను టార్గెట్ చేస్తు ఉగ్రవాదులు చంపుతుండటంతోె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాశ్మీర్ విద్యాశాక 177 మంది కాశ్మీర్ పండిట్ టీచర్ల జాబితాను బహిరంగపరిచింది.దీంట్లో టీచర్ల పేర్లు వారు బదిలీ చేయబడిని పాఠశాల వివరాలు కూడా ఉండటంతో మరోసారి వీరి భద్రతకు భగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
శుక్రవారం అమిత్ షాతో హైలెవల్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో వరసగా టార్గెటెడ్ కిల్లింగ్ జరగడంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.
మే 12న బుద్గామ్ లో చదూరా తాహసీల్ ఆఫీస్ లో పని చేస్తున్న రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆ తర్వాత నుంచి వరసగా లక్ష్యిత దాడులు జరగుతున్నాయి. ఇటీవల కాశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలు, ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!