Jammu Kahmir: కేంద్రం కీలక నిర్ణయం.. లోయలో కాశ్మీర్ పండిట్ టీచర్ల బదిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని గత కొంత కాలంగా కాశ్మీరి హిందువులు నిరసన, ఆందోళను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తడి పెరిగింది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీర పండిట్ ఉపాధ్యాయులను శ్రీనగర్ నగరానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను టార్గెట్ చేస్తు ఉగ్రవాదులు చంపుతుండటంతోె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాశ్మీర్ విద్యాశాక 177 మంది కాశ్మీర్ పండిట్ టీచర్ల జాబితాను బహిరంగపరిచింది.దీంట్లో టీచర్ల పేర్లు వారు బదిలీ చేయబడిని పాఠశాల వివరాలు కూడా ఉండటంతో మరోసారి వీరి భద్రతకు భగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Also Read
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
శుక్రవారం అమిత్ షాతో హైలెవల్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో వరసగా టార్గెటెడ్ కిల్లింగ్ జరగడంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.
మే 12న బుద్గామ్ లో చదూరా తాహసీల్ ఆఫీస్ లో పని చేస్తున్న రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆ తర్వాత నుంచి వరసగా లక్ష్యిత దాడులు జరగుతున్నాయి. ఇటీవల కాశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలు, ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!