Crime News: డెహ్రాడూన్లో దారుణం.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!
- డెహ్రాడూన్లో దారుణం
- బాలికపై సామూహిక అత్యాచారం
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moradabad Girl Gang Raped in Uttarakhand Bus Stand: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్టాండ్లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆగష్టు 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ద్వారా దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఆగష్టు 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట బస్ టెర్మినల్ 12వ నంబరు ప్లాట్ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉంది. బాలిక దీన స్థితిని గమనించిన బస్టాండ్లోని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఆమె జరిగిన విషయం చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు.
Also Read
బాలిక ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బస్సు డెహ్రాడూన్కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక.. ఒంటరిగా ఉన్న బాలికపై ముందుగా డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు అజయ్ సింగ్ చెప్పారు. ఆపై పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు, బస్టాండ్లోని క్యాషియర్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!