Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్..జైల్లో ఏం జరుగుతోంది..?
- ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి షాకింగ్ న్యూస్
- 125 మంది ఖైదీలు హెచ్ఐవీ పాజిటివ్
- 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి
- ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించారు. అయితే.. హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు. కానీ.. 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి బారిన పడినట్లు తేలింది. ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జైళ్లలో దాదాపు 14000 మంది ఖైదీలు ఉన్నారు.
READ MORE: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తీహార్ జైలులో ఎప్పటికప్పుడు ఖైదీలకు మెడికల్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇటీవలే వచ్చిన డీజీ సతీష్ గోల్చా తీహార్ జైలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మే, జూన్ నెలల్లో పదిన్నర వేల మంది ఖైదీలకు మెడికల్ చెకప్ చేయించారు. ఈ ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 125 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఖైదీలకు ఇటీవల ఎయిడ్స్ రాలేదని అధికారులు అంటున్నారు. వివిధ కారణాలతో ఈ ఖైదీలు బయటికి వెళ్లి నుంచి జైలుకు వచ్చినప్పుడు వారికి వైద్య పరీక్షలు చేయగా… అప్పుడు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
READ MORE:Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్..
మహిళా ఖైదీలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు..
ఇది కాకుండా.. పదిన్నర వేల మంది ఖైదీలలో 200 మంది ఖైదీలకు సిఫిలిస్ వ్యాధి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ ఖైదీలందరిలో టీబీ వ్యాధిగ్రస్థులు లేరు. తీహార్ జైలులోని ప్రొటెక్టివ్ సర్వే విభాగం.. మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షను నిర్వహించింది. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష చేయించారు. ఈ పరీక్ష ముందుజాగ్రత్తగా చేయబడుతుంది. తద్వారా ఎవరికైనా గర్భాశయ క్యాన్సర్ పరీక్ష సానుకూలంగా మారినట్లయితే.. వారికి ప్రారంభంలోనే మంచి చికిత్స అందిస్తారు. ఇప్పటి వరకైతే క్యాన్సర్ కేసుల సమాచారం ఇంకా రాలేదు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..