Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
- నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా?
- రాజకీయంగా చర్చనీయాంశమైన నితీష్ వ్యవహారం
- మధ్యలో వచ్చేసిన బెంగాల్ సీఎం మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానింపబడ్డారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎన్డీయేతర ముఖ్యమంత్రులు గుర్రుగా ఉన్నారు. దీంతో వారు ఎవరు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం సపోర్టుతో ఏర్పడింది. అంతేకాకుండా బడ్జెట్లో బీహార్, ఏపీ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. ఏపీ సీఎం చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేశారు. ఇక శనివారం జరిగే సమావేశానికి చంద్రబాబు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. మరో మిత్ర పక్షమైన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ సమావేశం ఉందని ముందుగానే తెలిసినా.. హాజరు కాలేదు. ఇప్పుడిదే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకముందు.. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ.. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే లోక్సభలో బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో నితీష్కుమార్పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు రావాలని.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్లో బీహార్ రోడ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినా.. జేడీయూ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో జేడీయూ అసంతృప్తిగానే ఉందని వార్తలు వినిపించాయి.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
ఈ నేపథ్యంలోనే శనివారం మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి నితీష్కుమార్ హాజరుకాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్కు చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే వెళ్లారు. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రే స్వయంగా హాజరై.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించాల్సి ఉండగా.. నితీష్ హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సమావేశానికి ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ హాజరయ్యారు. కానీ సమావేశంలో ఎంత సేపు ఉండలేదు. వాకౌట్ చేసి బయటకు వచ్చి.. మీడియాతో ఆవేశంతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతుండగా.. తన మైక్ కట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులెవ్వరూ హాజరు కాకపోయినా.. తాను హాజరయ్యానని.. కానీ మాట్లాడే సమయం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అందుకే సమావేశం నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు.
ఇక సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ ఎందుకు హాజరు కాలేదన్నదే ఆసక్తిగా మారింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!