ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 11, 919 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3.38 కొట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28, 762 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 470 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64, 623 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,242 మంది కరోనా నుంచి కోలుకోగా 73.4 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. ఇక దేశంలో రోజు వారీ పాజిటివ్ కేసుల శాతం 0.82 గా ఉంది అని పేర్కొంది సర్కార్.