10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఎక్సామ్స్ రాయనున్నాయి. వీరిలో రెగ్యూలర్ స్టూడెంట్స్ 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి ఫెయిల్ అయిన వారు కాగా.. ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కాగా.. 98,726 మంది తెలుగు మీడియం, 7,851 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.
Also Read
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా.. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానిక కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సహా పరీక్ష హాల్లో ఎవరూ వాడానికి కానీ.. తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్ లీగ్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అంతేకాదు, ఆయా పాఠశాలల కరస్పాండెట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది.
మాస్ కాపీయింగ్ గనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈవోలు,డీఈవోలదే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద ఎంఈవో, డీఈవో నెంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక, కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ప్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని విద్యాశాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!