Students Suicide: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్.. మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. అందరి కంటే బాగా చదవాలి, మొదటి స్థానంలో నిలవాలన్న లక్ష్యాలతో సతమతమవుతున్నారు. శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ పరీక్షలు అనే సరికి భయాందోళనకు గురవుతున్నారు. సరిగ్గా రాయలేదనో, అంచనాలను అందుకోలేకపోయమనో, ర్యాంక్ రాలేదనో, పాస్ అవలేదనో ఇలా ఎన్నో కారణాలతో విద్యార్థులు.. తమ నిండు జీవితాన్ని ముగించేస్తున్నారు. వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగుల్చుతున్నారు.
Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్జిత్ పంజ్వార్ హత్య!
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
తాజాగా ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబు కోటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో చీరతో దూలానికి ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో మరో విద్యార్థిని కామేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. పదో తరగతి ఫలితాల్లో గణితంలో కామేశ్వరి ఫెయిల్ కాగా.. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి ప్యాపిలి కస్తూరిబా విద్యాలయంలో చదువుకుంటోంది. కామేశ్వరి మృతితో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!