Siddaramaiah:100 శాతం రిజర్వేషన్ పై విమర్శలు..బిల్లును తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
- 100శాతం రిజర్వేషన్ తో రాష్ట్రంలో పెద్ద దుమారం
- ఈ బిల్లును పునఃపరిశీలించనున్న కర్ణాటక ప్రభుత్వం
- నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మంత్రివర్గం నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ‘కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్’ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ “ఎక్స్”లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు తమ సొంత భూమిలో సుఖంగా జీవించే అవకాశం కల్పించాలని మా ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మేము కన్నడ అనుకూల ప్రభుత్వం. కన్నడ ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత అన్నారు.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
కాగా.. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు చేసిన పోస్ట్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించారు. కర్ణాటక సర్కారు నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో సిద్ధరామయ్య తాను చేసిన పోస్టును తొలగించారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ రోల్స్లో 70 శాతం, మేనేజ్మెంట్ రోల్స్లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు కర్ణాటక కార్మిక శాఖ వివరణ ఇచ్చింది.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!