Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై సిరా విసిరిన నిందితుడు అజయ్కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
ఈ దాడికి పాల్పడింది బీజేపీనేనని కన్హయ్య కుమార్ ఆరోపిస్తూ, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. కన్హయ్యపై దాడి జరిగినప్పుడు స్థానిక కౌన్సిలర్ ఛాయా శర్మ కూడా ఆయన వెంటే ఉన్నారు. పార్టీ తనను అభ్యర్థిని చేసినప్పటి నుంచి మనోజ్ తివారీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కన్హయ్య పేర్కొన్నారు. తమ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించడం లేదన్న భావన తివారీకి మొదలై.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని కన్హయ్య కుమార్ తెలిపారు. తమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ తివారీ తనకు పెరుగుతున్న ప్రజాదరణతో నిరాశ చెందారని, అందుకే తనపై దాడికి గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా హింసకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.
Jaya Jaya He Telangana: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!
కాగా.. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానం నుండి మనోజ్ తివారీని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సీటుపై వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కన్హయ్య తన రాజకీయాలను JNU నుండి ప్రారంభించాగా.. మనోజ్ తివారీ ప్రసిద్ధ నటుడు, గాయకుడు.. ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?