Pahalgam Terror Attack: జిప్లైన్ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్ అన్నాడు.. ఆపై కాల్పులు
- పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మరో వీడియో..
- జిప్లైన్ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్ అన్నాడు..
- జిప్లైన్ ఆపరేటర్ నినాదం తర్వాత కాల్పులు జరిగాయి: టూరిస్టు రిషి భట్
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ పై వేలాడు తీసుకున్న వీడియోలో.. బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Read Also: High Court: గ్రూప్-1 పిటిషనర్లకు జరిమానా విధించిన హైకోర్టు..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
అయితే, తాను జిప్లైన్లోకి రాకముందే, తన భార్య, కొడుకు, మరో నలుగురు ముందుకు వెళ్లిపోయారు.. అప్పుడు నా భార్య పక్కనే మరో రెండు జంటలు ఉండే.. ఓ ఉగ్రవాది వచ్చి, వారి పేర్లు, మతం అడిగి, ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపాడు.. నేను రోప్వేలో ఉన్నందున, నా ప్రాణాలు రక్షించుకోగలిగాను.. నేను నా భార్యతో ఉండి ఉంటే ఇప్పటికే చనిపోయి ఉండే వాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ టెర్రరిస్టు అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే.. నేను నా జిప్లైన్ తాడును ఆపి, దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి క్రిందికి దూకి, నా భార్య- కొడుకుతో అక్కడ నుంచి పారిపోయాను అని టూరిస్టు రిషి భట్ తెలిపాడు. అప్పుడు, నేను నా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడం గురించి మాత్రమే ఆలోచించానని పేర్కొన్నారు. ఆ కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయని వెల్లడించాడు.
Read Also: KTR : మాజీ మంత్రి కేటీఆర్కు గాయం.. బెడ్ రెస్ట్ సూచించిన వైద్యులు
ఇక, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు భద్రతా దళాల మాదిరిగా దుస్తులు ధరించారు అని పర్యటనకుడు రిషి భట్ తెలిపాడు. నేను పరిగెడుతున్నప్పుడు, ఇద్దరు భద్రతా దళాలను కాల్చి చంపడం చూశా.. వారి దగ్గర నుంచి ఉగ్రవాదులు యూనిఫాంలను దొంగిలించారని నేను అనుకుంటున్నాను.. ఈ కాల్పులు ప్రారంభమైనప్పుడు, స్థానికులు ఎవరూ సంఘటన స్థలంలో లేరని అన్నారు. కానీ, నేను అడవిలోకి పారిపోయిన 18 నిమిషాల్లోనే, భారత సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!