Jyoti Malhotra: జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి.. మీడియాకు ఏం చెప్పాడంటే..!
- హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్
- పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ జ్యోతి మల్హోత్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు. కుమార్తెను కలిసి బయటకు వచ్చిన తర్వాత హరీష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె నేరాన్ని అంగీకరిస్తోందని.. నిర్దోషినని చెప్పిందని పేర్కొన్నాడు. గతంలో హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్లో వీడియోలు తీసేందుకే వెళ్లిందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: YS Jagan: “టీడీపీ” తెలుగు డ్రామా పార్టీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చర్యలకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద ఆమెపై కేసు నమోదు చేసిన తర్వాత మే 17న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో ఆమెను ఐదు రోజుల కస్టడీలో ఉంచారు. అనంతరం మే 22న మరో నాలుగు రోజులు పొడిగించారు. తిరిగి మే 26న ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం హిసార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?
9 రోజుల పోలీస్ కస్టడీలో జ్యోతిని విచారించినట్లు పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. వ్యూహాత్మక సమాచారాన్ని లేదా సైనిక సమాచారాన్ని పంచుకున్నట్లు ఆధారాలు దొరకలేదన్నారు. అయితే పాకిస్థాన్ నిఘా వ్యక్తులతో ఉన్నట్లు గుర్తింపబడిందన్నారు. వాళ్లతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు ధృవీకరించారు. దర్యాప్తు సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారించాయని పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన నాలుగు బ్యాంక్ ఖాతాల డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక జ్యోతి మల్హోత్రా ఇస్లాం మతంలోకి మారినట్లు గానీ.. లేదంటే పాకిస్థాన్ నిఘా వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచర్యగా పని చేసినట్లుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె 3 సార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చింది. అంతేకాకుండా పలుమార్లు కాశ్మీర్ సందర్శించింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి ముందు కూడా అక్కడ వీడియోలు తీసినట్లుగా గుర్తించారు. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా వ్యక్తులతో పంచుకున్నట్లుగా అనుమానించి జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వీడియోల్లో పాకిస్థాన్ అధికారులు చాలా క్లోజ్గా ఉన్న దృశ్యాలు కనిపించాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!